News

News

ఘనంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు ఆదివారం తిరుమలలో ఘనంగా ముగిసింది. సాయంత్రం శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయల్దేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ముందు రెండురోజుల మాదిరే ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర క‌ల్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలను పారాయణం చేశారు. కళాకారులు మంగ‌ళ‌క‌రంగా సంగీత‌, మేళ‌, తాళ వాయిద్యాలను ప్ర‌ద‌ర్శించారు. ఇందులో భైరవి, నళినకాంతి, శంకరాభరణం, హిందూస్థాని, ఖరహరప్రియ,నీలాంబరి రాగాలను సుమధురంగా పలికించారు. అనంత‌రం స్వామి దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో మూడురోజుల పద్మావతీ పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి....
News

వేసవి సెలవుల దృష్ట్యా తిరుమల, శ్రీశైలంలో భక్తుల రద్దీ

రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. తిరుమల, శ్రీశైలం, క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దైవ నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి తిరుమలేశుడి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తో పాటు...
News

వైభవంగా అన్నవరం సత్యనారాయణస్వామి కల్యాణం

కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ఆదివారం కనులపండువగా జరిగింది. రాత్రి 9.30 గంటలకు కల్యాణతంతు ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో సుందరంగా తీర్చిదిద్దిన కల్యాణవేదికపై స్వామి, అమ్మవార్లను, ఆ పక్కనే పెళ్లిపెద్దలు సీతారాముల వారిని ఆసీనులను చేసి కల్యాణం...
News

రోదసిలోకి తెలుగుతేజం

తెలుగు తేజం గోపీచంద్‌ తోటకూర ఆదివారం దిగ్విజయంగా రోదసియాత్ర చేశారు. తద్వారా భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. రాకేశ్‌ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు పొందారు. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌ సంస్థ రూపొందించిన న్యూషెపర్డ్‌-25 (ఎన్‌ఎస్‌-25) వ్యోమనౌకలో గోపీచంద్‌ ఈ యాత్ర పూర్తిచేశారు. న్యూషెపర్డ్‌ రాకెట్‌కు ఇది ఏడో మానవసహిత అంతరిక్షయాత్ర. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9.36 గంటలకు పశ్చిమ టెక్సాస్‌లోని ప్రయోగ వేదిక నుంచి ఇది నింగిలోకి దూసుకెళ్లింది. దీని ఎగువ భాగంలోని క్యాప్సూల్‌లో ఆరుగురు యాత్రికులు ఆసీనులయ్యారు. భారత తొలి స్పేస్‌ టూరిస్టుగా గుర్తింపు పొందారు. విజయవాడలో పుట్టిన గోపీచంద్‌ తోటకూర.. అట్లాంటా శివారులోని ‘ప్రిజర్వ్‌ లైఫ్‌’ సంస్థకు సహ-వ్యవస్థాపకుడిగా ఉన్నారు. గోపీచంద్‌ పైలట్‌గానూ శిక్షణ పొందారు....
News

శ్రీశైలంలో అభిషేకం టికెట్లపై అదనపు బాదుడు.. భక్తుల జేబుకు చిల్లు

శ్రీశైలం దేవస్థానంలో భక్తుల నుంచి అదనంగా టికెట్‌ రుసుం వసూలు చేస్తున్నారు. అభిషేక కర్తలతో పాటు అదనంగా వచ్చే వారికి టికెట్‌ రేటు పెంచి విక్రయిస్తున్నారు. సాధారణంగా అభిషేకం టికెట్‌ ధర రూ.1500. దంపతులతోపాటు అదనంగా వచ్చే వారికి రూ.500 చొప్పున...
News

రెండో విడత చందనం అరగదీత ప్రారంభం

విశాఖపట్నం సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో రెండో విడత చందనం అరగదీత ఘనంగా ప్రారంభమైంది. ఈనెల 23న వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని ఆరోజు తెల్లవారుజామున స్వామికి సమర్పించనున్న మూడు మణుగుల పచ్చిచందనం (120 కిలోలు) సమకూర్చేందుకు అరగదీత కార్యక్రమం చేపట్టారు....
ArticlesNews

స్వరాజ్య ఉద్యమ ప్రకాశం

(మే 20 - టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి) కొదమసింహంలా స్వాతంత్య్రం కోసం సమరం చేసిన మన కేసరి టంగుటూరి ప్రకాశంపంతులు. ఆయన మన మొదటి ముఖ్యమంత్రి. తుది వరకూ దేశం కోసం, జనం కోసం పరితపించిన తపస్వి. మద్రాసులో సైమన్ కమీషన్‌ను ఎదిరించిన సందర్భంలో తుపాకీకి రొమ్ము చూపించిన ఘనుడు. ఈయన దెబ్బకు తట్టుకోలేక వారే వెన్నుచూపించి వెళ్లిపోయారు. అందుకే ప్రకాశంను ‘ఆంధ్రకేసరి’ అని ప్రజలంతా గొంతెత్తి పిలుచుకున్నారు. గోపాలకృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు 23 ఆగస్ట్ 1872న ప్రకాశం పంతులు జన్మించారు. అతి సాధారణ కుటుంబంలో పుట్టి, ఆధునికాంధ్ర ప్రజానాయకుల్లో అసాధారణంగా ఎదిగి, ప్రజలే ప్రకాశం, ప్రకాశమే ప్రజలు అనిపించుకున్న నిస్వార్థ జీవి. ప్రకాశం జీవితం, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, స్వాతంత్ర్య ఉద్యమం వేరువేరు కావు. స్వాతంత్ర్య సమర యోధుడుగా ఎంతటి విజయాన్ని సాధించాడో, న్యాయవాదిగానూ వృత్తిలో...
ArticlesNews

భారత్ లో తగ్గిన హిందూ జనాభా, పొరుగుదేశాల్లో మాత్రం మరోలా…?

భారత్ లో హిందువుల వాటా గత కొన్ని దశాబ్దాలుగా తగ్గినట్టు ప్రధాని ఆర్థిక సలహా మండలి (పీఎమ్- ఈఏసీ) నేతృత్వంలో జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. పొరుగు దేశాల్లో మాత్రం ఇందుకు భిన్నమైన గణాంకాలు నమోదు అయ్యాయి. అక్కడ మెజారిటీ మతస్తుల...
News

శ్రీలంకలో సీతమ్మకు ఆలయం, ప్రాణప్రతిష్ఠకు సరయూజలాలు

శ్రీలంక నువారా ఏలియాలోని అశోకవనం ప్రాంతంలో ‘సీత అమ్మ మందిరం’ నిర్మాణం జరుగుతోంది. ఆ ఆలయంలో సీతామాత ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అయోధ్య నుంచి పవిత్ర సరయూ జలాలను, మరికొన్ని కానుకలను పంపిస్తున్నారు. శ్రీలంకలో రావణాసురుడు సీతమ్మను బంధించిన అశోకవనం ప్రదేశంలోనే ఆ...
1 1,212 1,213 1,214 1,215 1,216 2,480
Page 1214 of 2480