
750views
ఆయుష్ విభాగం వారి ఇమ్యూనిటీ బూస్ట్ సూచనలు పాటించవలసిందిగా ఆరోగ్యభారతి అందరికీ సూచిస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘ఆరోగ్యసేతు’ యాప్ ని మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవలసిందిగా కూడా ఆరోగ్యభారతి సూచిస్తోంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించే విధానం మరియు కషాయం తయారీ విధానం గురించి ఏప్రిల్ 21న ఆరోగ్యభారతి అఖిల భారత కార్యదర్శి డా.మురళీకృష్ణగారు తెలియజేయనున్నారు. ఆ కార్యక్రమం ఏప్రిల్ 21 ఉదయం 10.30ని.లకు vskandhra.org లో లైవ్ లో ప్రసారమవుతుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని వారి సూచనలను తప్పక విని ఆచరించవలసిందిగా ఆరోగ్య భారతి తెలుగువారికందరికీ విజ్ఞప్తి చేస్తోంది.



