
269views

భారతదేశ సాంస్కృతికత కొన్ని లక్షల సంవత్సరాల పురాతనమైనది, ఇది ఇప్పటికీ ఇంకా నవీనంగానే ఉంది. మనందరం ఆ గొప్ప సాంస్కృతిక వారసత్వానికి వారసలం. ప్రపంచమంతా కూడా మన సాంస్కృతికత వ్యాపించి ఉంది. మనకు ఎన్నో సంస్కృతులు ఉన్నాయి. వాటిల్లో కొన్నింటిని యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాగా ప్రకటించింది. అందులో 2008 నుండి 2025 మధ్య యునెస్కో ప్రకటించిన పది హిందూ సంప్రదాయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఛఠ్ పూజ

దీపావళి అయిన ఆరో రోజుల తర్వాత ఈ పండుగను జరుపుకుంటారు. దీన్ని ప్రధానంగా బీహార్,జార్ఖ:డ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో చేసుకుంటారు. సూర్యారాధనకు ఇది ప్రసిద్ధి. దీనికోసం రెండురోజుల పాటు ఉపవాసం ఉండి, నదులు, చెరువుల్లో పూజను నిర్వహిస్తారు. పర్యావరణ హితంగా సాగే ఈ పండుగ మనదేశ సాంస్కృతిక , ఆధ్యాత్మిక కార్యక్రమం. ఆగస్టు 8, 2025న, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఛఠ్ పూజను యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చాలని సంగీత నాటక అకాడమీకి ప్రతిపాదన పంపింది.
గుజరాత్ గర్బా

గుజరాత్కు చెందిన ప్రసిద్ధ జానపద నృత్యం అయిన గర్బా, శక్తికి చిహ్నంగా భావించే దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో దీన్ని ఎక్కువగా చేస్తారు. భక్తిపాటలకు అనుగుణంగా ప్రజలందరూ కలిసి ఎలాంటి బేషజాలు లేకుండా నాట్యం చేయడం ఈ నఈత్యం ప్రత్యేకత. డిసెంబర్ 6, 2023న, యునెస్కో దీన్ని సాంస్కృతిక వారసత్వ ప్రతినిధి జాబితాలో చేర్చింది.
కోల్కతా దుర్గా పూజ

దేవీ నవరాత్రలు దేశమంతటా జరిగినప్పటికీ కోల్ కతా వాటికి పెట్టింది పేరు. డిసెంబర్ 15, 2021న, పారిస్లో జరిగిన 16వ కమిటీ సమావేశంలో కోల్కతా దుర్గా పూజను యునెస్కో అసంపూర్ణ సాంస్కృతిక వారసత్వ మానవత్వ ప్రతినిధి జాబితాలో చేర్చారు. దీనితో ఈ గౌరవం పొందిన ఆసియాలో ఇది మొదటి ఉత్సవంగా నిలిచింది.
కుంభమేళాను

డిసెంబర్ 7, 2017న యునెస్కో యొక్క మానవాళి అవ్యక్త సాంస్కృతిక వారసత్వ ప్రతినిధి జాబితాలో కుంభమేళాను చేర్చారు ప్రపంచంలోనే అతిపెద్ద యాత్రికుల సమావేశంగా దీన్ని పేర్కొన్నారు. ఈ మేళా ప్రతి 12 సంవత్సరాలకు నాలుగు వేర్వేరు ప్రదేశాలలో జరుగుతుంది: ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని నాసిక్. ఇందులో పవిత్ర స్నానం చేస్తారు.. ఈ కుంభమేళ హిందూ సంప్రదాయాలను కాపాడుతూ , బలమైన సమాజ భావాన్ని పెంపొందిస్తూ సమ్మిళితత్వం, సహనం ,సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
మణిపూర్లోని నాట్-సంకీర్తన

డిసెంబర్ 4, 2013న, మణిపురి నాట్-సంకీర్తనను యునెస్కో సాంస్కృతిక వారసత్వ ప్రతినిధి జాబితాలో చేర్చింది. 18వ శతాబ్దంలో రాజు భాగ్యచంద్ర సింగ్ రూపొందించిన ఈ ఆచారంలో భగవాన్ కృష్ణుడి జీవితాన్ని వివరించడానికి డప్పులు కొడుతూ పాడుతూ, దానికి అనుగుణంగా నాట్యం చేస్తారు. ఈ ఆచారం మణిపురి వైష్ణవ సంప్రదాయాలకు కేంద్రం అని చెప్పవచ్చు.
చౌ నృత్యం

నవంబర్ 19, 2010న, చౌ నృత్యం యూనెస్కో సాంస్కృతిక వారసత్వ ప్రతినిధి జాబితాలో చేర్చబడింది. తూర్పు భారతదేశం నుండి ఉద్భవించిన ఈ నృత్యం, యుద్ధ కదలికలు, జానపద సంప్రదాయాలు ,మహాభారతం, రామాయణం మరియు స్థానిక ఇతిహాసాల యొక్క శక్తివంతమైన సమ్మేళనం. సెరైకెల్లా, పురులియా , మయూర్భంజ్-చో అనే మూడు విభిన్న శైలులలో ప్రదర్శించబడుతుంది, తరచుగా చైత్ర పర్వం వంటి పండుగలతో ముడిపడి ఉంటుంది.
రామన్ పండుగ యునెస్కో అంతర్లీన వారసత్వ సంపదగా జాబితా చేయబడింది

అక్టోబర్ 2, 2009న, యునెస్కో ఉత్తరాఖండ్లోని సాలూర్-డంగ్రా లో జరిగే రమ్మాన్ పండుగను గుర్తించింది. స్థానిక దేవత భూమియల్ దేవత గౌరవార్థం ఏప్రిల్ చివరిలో జరిగే ఈ ఉత్సవంలో రాముడి ఇతిహాసం పఠనం, ఇతిహాసాలను చెప్పడం, జానపద పాటలు పాడటం ,నఈత్యాలు చేయడం ఉంటాయి. గ్రామస్తులు అందరూ కలిసి ఈ పండుగ చేసుకుంటారు. ఈ పండుగ పర్యావరణ, ఆధ్యాత్మిక , సాంస్కృతిక విలువలను ప్రతిబింబిస్తుంది, ఇది స్థానిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది.
రాంలీలా: దసరా మైదానాల నుండి యునెస్కో జాబితాలోకి

2008లో, రామ్లీలాను యునెస్కో సాంస్కృతిక వారసత్వ ప్రతినిధి జాబితాలో చేర్చారు, ఇది సాంస్కృతిక ఐక్యతను సూచిస్తుంది. “రాముడి నాటకం” అని అర్ధం వచ్చే రామ్లీలా జరుగుతుంది. ఇందులో రాముడి గురించిన, పాట, కథనం, పారాయణం సంభాషణల ద్వారా రామాయణాన్ని నాటకీయంగా తిరిగి చెప్పడమే రామలీల., దీనిని దసరా సందర్భంగా ఉత్తర భారతదేశం అంతటా ప్రదర్శిస్తారు.అయితే రామ్ నగరలో మాత్రం ఒక నెల పాటు రోజూ సాగుతుంది.
వేద జపం: యునెస్కో గుర్తించిన పురాతన మౌఖిక సంప్రదాయం

ప్రపంచంలోని పురాతన సాంస్కృతిక సంప్రదాయాలలో ఒకటైన వేద జప సంప్రదాయం 2008లో యునెస్కో ప్రతినిధి జాబితాలో చేర్చబడింది. 3,500 సంవత్సరాల క్రితం ఆర్యులు అభివృద్ధి చేసిన ఈ వారసత్వంలో సంస్కృత కవిత్వం, తాత్విక సంభాషణలు, పురాణాలు , నాలుగు వేదాల నుండి ఆచార శ్లోకాలు ఉన్నాయి: నాలుగు వేదాలలో నేడు, 1,000 కంటే ఎక్కువ పారాయణ శాఖలలో నేడు 13 మాత్రమే మనుగడలో ఉన్నాయి.
కుటియాట్టం: యునెస్కో గుర్తింపు పొందిన కేరళ పురాతన సంస్కృత నాటకం.
2008లో, కుటియాట్టం యునెస్కో సాంస్కృతిక వారసత్వ ప్రతినిధి జాబితాలో చేర్చబడింది. 2,000

సంవత్సరాల క్రితం కేరళలో ఉద్భవించినది ఈ నాటకం. భారతదేశంలోని పురాతన నాటక సంప్రదాయాలలో ఒకటిగా కుట్టియాట్టం ప్రసిద్ధి పొందింది. ఈ కళారూపం సంస్కృత భాష మిళితంతో, స్థానిక సంప్రదాయాలతో ఉంటుంది





