News

గంగలో కలుషితం లేదని పరిశోధనలు.. మరి మసీదు లోపలి మాటేంటి?

262views

మహా కుంభమేళా ఘాట్‌లల్లోని గంగా జలంలో ఏ విధమైన మానవ విసర్జిత కలుషితాలు లేవని శాస్త్రీయంగా నిరూపించబడింది. హిందూ సమాజ వ్యతిరేక వీరులు, ముస్లింల మసీదులలో “వుజూల”లో ఉన్న మానవ ఉమ్ము తదితర కలుషితాలపై ఏ విధమైన రిపోర్టు తయారు చేయరు గానీ, హిందువుల మహాకుంభ మేళాపై మాత్రం అసత్యమైన రిపోర్టులు ఇస్తూంటారని మరొకసారి శాస్త్రీయంగా నిరూపణ అయింది. శాస్త్రవేత్త, పద్మ అవార్డు గ్రహీత, డాక్టర్ శంకర్ అనేక శాస్త్రీయ పరిశోధనల ద్వారా గంగాజలంలోని స్వయం సమృద్ధ శక్తిని నిరూపించారు.

హిందూ సమాజం చేసుకొనే ఈ మహాకుంభమేళా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఒక ప్రత్యేక సమ్మేళనం. 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ అంతరిక్ష అద్భుత అనుభవం అందుకోవటానికి ప్రజలు కోట్లాదిగా తరలి వస్తున్నారు. అనేక అప్రతిహత రికార్డులు నమోదవుతున్నాయి. ఇదంతా చూసి కళ్ళు కుట్టిన అనేక శక్తులు అసత్యమైన రిపోర్టులతో ప్రజలను భయపెట్టడానికి తీవ్ర ప్రయత్నం చేశాయి. మానవ మలిన అవశేషాలతో నిండిన నీళ్ళలో ఇంతమంది స్నానం చేస్తే అనేక వ్యాధులు వస్తాయంటూ స్వయం ప్రకటిత మేధావులు ఊదరగొట్టేశారు. సందిట్లో సడే మియా అంటూ అనేక దేశవ్యతిరేక శక్తులు కో అంటే కో అన్నాయి. ఈ రిపోర్టులు పూర్తిగా అసత్యం అనీ “గంగా జలంలో” ఒక ప్రత్యేక మైన స్వయంగా శుధ్ధి చేసుకునే అద్వితీయమైన శక్తి ఉందని శంకర్ తమ పరిశోధనలో తేల్చారు.

ప్రవహించే నదిలో మలినాలు నిలువవు అని చిన్నపిల్లలప్పుడే మనం తెలుసుకుని ఉంటాం. నిలువ ఉన్న నీటిలోనే మాలిన్యాలు నిలబతాయన్నది జగమెరిగిన సత్యం.

ఇదంతా ఒక పార్శ్వం అయితే, ఈ స్వయం ప్రకటిత మేధావులు హిందూ ధార్మిక విషయాల్లో మాత్రమే ఈ విధమైన ప్రచారాలు చేస్తారు. మరి ఇతర మత వ్యవహారాల్లోని ఇవే విషయాలను ఎందుకు చూడరూ? మాట్లాడరూ? అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

X మాధ్యమంగా షేర్ చేయబడుతున్న ఈ వీడియోలో కొందరు ముస్లింలు తమ మసీదులలో నిలువ చేయబడ్డ నీటిలో ఒకే సమయంలో కాళ్లు చేతులు కడగటం, నోటిలో నీటిని పోసుకుని పుక్కిలించి ఉమ్మేయడం, ముక్కును చీదడం వంటివి చేస్తున్నారు. నెటిజెన్లు ఈ వీడియోని చూపుతూ ఆ స్వయం ప్రకటిత మేధావులను ప్రశ్నించారు.

ఆందోళన కలిగించే విషయం ఏమిటీ అంటే ఈ స్వయం ప్రకటిత ఆరోగ్యాభిలాషులు, ముస్లింలు ప్రతిరోజు మసీదులల్లో చేసుకొనే ఈ మతపరమైన కార్యక్రమం గురించిగానీ, వారికి కలిగే ఆరోగ్య సమస్యల గురించి మాత్రం ఎందుకు నోరు కుట్టుకొని ఎందుకు కూర్చొంటారో??.