హైందవ శంఖారావం ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి
ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రసంగం
మన రాష్ట్రంలో సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. ఈ జనసందోహాన్ని, ఈ జెండాల రెపరెపలనూ చూస్తే పండుగ ముందుగా వచ్చింది.
1987లో రాష్ట్రప్రభుత్వం దేవాలయాల ఉద్ధరణ కోసం అంటూ చట్టసవరణ చేసారు. దాని గురించి సౌందరరాజన్ గారు ‘చట్టం కోరల్లో దేవాలయాలు’ అనే పుస్తకం రాసారు. దానిలో, ప్రభుత్వం దేవదాయ ధర్మదాయ శాఖ అనే కొండచిలువను సృష్టించింది అని చెప్పారు.
చల్లా కొండయ్య కమిషన్ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం చేసిన మార్పులు హిందూ ఆలయ వ్యవస్థకు శరాఘాతంగా మారింది.
ప్రతీ హిందువు ఇంట్లో పూజామందిరం ఉంటుంది. మరి ప్రత్యేకంగా దేవాలయాలు దేనికి? అంటే ఇంట్లో పూజ వ్యక్తిగతం. గుడిలో పూజ సామాజికం. దేవాలయాలు హిందువుల అస్తిత్వం. అందుకే దాన్ని చెడగొట్టడం కోసమే ముష్కరులు ఆలయాలపై దాడులు చేసారు తప్ప నిధులు కొల్లగొట్టడం కోసం కాదు.
1987 చట్టం ద్వారా అర్చకులను గట్టి దెబ్బ తీసింది. దేవాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. హిందూ ధర్మాచార్యులు ఆ చట్టాన్ని వ్యతిరేకించారు.
ఆరుగురు సభ్యుల కమిషన్లో కేవలం ముగ్గురు సభ్యులతో చట్టాన్ని రూపకల్పన చేసారు. దాన్ని శాసనసభలో కేవలం నాలుగు గంటల నామమాత్రపు చర్చతో ఆమోదించి, చట్టరూపం తెచ్చారు.
అర్చకులను ఉద్యోగులుగా మార్చేసిన చట్టం అది. అర్చకులు ఉద్యోగులు కాదు, తమ దైవం సేవలో జీవితాన్ని గడిపేవారు. వారికి ఉద్యోగ విరమణ కల్పించడం అన్యాయం.
ఆ చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీం కూడా అర్చకులకు అనుకూలంగా వ్యాఖ్యానించింది. సుప్రీం ఆదేశాలు నేటికీ పూర్తిగా అమల్లోకి రాలేదు.
మన రాష్ట్రంలో 20వేలకు పైగా గుడులకు ఆదాయం నామమాత్రం. 8 దేవాలయాల్లో మాత్రమే పెద్ద ఆదాయం. 1987 చట్టంతో మన దేవాలయాలపై గొడ్డలివేటు పడింది.
లౌకికవాదాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవాలి. అది మన అస్తిత్వానికి సమస్య కాలేదు, కారాదు.
"మానవ సేవే మాధవ సేవ" అనే మూల మంత్రంతో విపత్తుల సమయంలో సమాజానికి తోడ్పడే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), అస్సాంలో సంభవించిన భయంకరమైన వరదల వేళ...
బంగ్లాదేశ్లో మరోసారి రాజకీయ కల్లోలం మొదలైనట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్, మాజీ ప్రధాని షేక్ హసీనాతో మాట్లాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కథనాలు అక్కడి...
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హెచ్డీపీపీ సహకారంతో నిర్వహిస్తున్న‘మహాలక్ష్మీ దీపపూజ’ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో, దీనిని త్వరలో గ్రామస్థాయికి విస్తరించనున్నట్లు టీటీడీ...
ప్రభుత్వ విద్యాలయాల్లో వేల సంఖ్యలో మొక్కలు నాటి వనాలు పెంచడం ద్వారా కర్బన ఉద్గారాల్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకర వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేసేందుకు వీబీ...
రాంచీ: సమాజంలో ఐక్యత, సామాజిక సామరస్యం మరియు బలమైన జాతీయ చైతన్యాన్ని పెంపొందించడమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన లక్ష్యమని సీనియర్ ప్రచారక్, అఖిల్ భారతీయ...