News

జమ్ము కశ్మీర్‌లో భారీ ఉగ్రదాడి..

261views

జమ్ము కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రదాడి జరిగింది. ఆదివారం శ్రీనగర్‌ సండే మార్కెట్‌లోని టూరిస్ట్‌ సెంటర్‌ ఆఫీస్‌పై ఉగ్రవాదులు గ్రనేడ్‌లు విసిరారు. ఈ దాడిలో పది మందికి(12 మంది) పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

శ్రీ నగర్‌ నగరానికి గుండెకాయగా చెప్పుకునే లాల్‌ చౌక్‌ను ఆనుకున్న రోడ్డులోనే సండే మార్కెట్‌ పేరిట వారాంతపు సంత నిర్వహిస్తారు. మార్కెట్‌ కారణంగా టీఆర్‌సీ గ్రౌండ్‌లో విపరీతమైన జన రద్దీ నెలకొంది. ఇదే అదనుగా భావించిన ఉగ్రవాదులు మైదానంలోకి గ్రనేడ్లు విసిరినట్లు స్థానిక మీడియా చానెల్స్‌ కథనాలు ఇస్తున్నాయి.

దాడి జరిగిన వెంటనే పారామిలిటరీ బలగాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు చేర్చాయి. ప్రస్తుతం అక్కడ ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. లష్కరే తాయిబా గ్రూప్‌కు చెందిన టాప్‌ కమాండర్‌ ఒకరిని.. ఖన్యార్‌ ప్రాంతంలో భారత సైన్యం మట్టుపెట్టింది. ఆ మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం.