
217views
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన మూడు వ్యవస్థల్లో ఒకటైన న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేసేలా.. 25వ రాజ్యాంగ సవరణకు పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు అధికారాలను, ప్రధాన న్యాయమూర్తి నియామకాన్ని ప్రభావితం చేసే సవరణ ఇది. దేశమంతా గాఢనిద్రలో మునిగి ఉన్న సమయాన.. ఆదివారం అర్ధరాత్రి వేళ 11.36 గంటల సమయంలో సమావేశమై.. తెల్లవారుజామున 5 గంటల దాకా సాగిన పార్లమెంటు సెషన్లో ఉభయసభలూ ఈ సవరణకు ఆమోదం తెలిపాయి. అనంతరం పాకిస్థాన్ ప్రెసిడెంట్ అసిఫ్ అలీ జర్దారీ సైతం ఆగమేఘాలపై ఈ చట్టానికి పచ్చజెండా ఊపారు. ఇందులోని కీలక అంశాలు..





