విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో సర్వ దోష నివారణ కోసం శాంతి హోమాన్ని నిర్వహించారు.ఆలయంలో సర్వదోష నివారణార్థం, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశముల మేరకు అన్ని ప్రముఖ దేవాలయాల్లో శాంతి హోమములు నిర్వహించుటలో భాగంగా దేవస్థానంలోని చండీ యాగశాలలో ఆలయ ఈవో కె ఎస్ రామరావు సమక్షంలో వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ ఆలయ స్థానాచార్యులు విష్ణు భట్ల శివప్రసాద శర్మ, వైదిక కమిటీ సభ్యులు, అర్చకులచే శాంతి హోమం శాస్త్రోక్తముగా నిర్వహించారు.కార్యక్రమం అనంతరం ఆలయ ఈవో కేఎస్ రామారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేవస్థానంలో శుద్ధి కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇటీవలే దేవస్థానంలో పవిత్రోత్సవములు నిర్వహించడం జరిగినదని, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వ పదార్థముల దోషములన్నీనివారణ అయ్యి, శాంతి పొందుటకు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న సత్ సంకల్పంతో పవిత్ర ఇంద్రకీలాద్రిపై అమ్మలగన్నయమ్మ, జగన్మాత సన్నిధిలో శాంతి హోమం నిర్వహించామన్నారు.
38
You Might Also Like
పాక్లో షియా, సున్నీ ముస్లింల పోరు.. 25 మంది మృతి
2
పాకిస్తాన్లోని వాయువ్య ప్రాంతంలో షియా, సున్నీ వర్గాలకు చెందినవారి మధ్య గత కొద్దిరోజులుగా భూ వివాదానికి సంబంధించి జరుగుతున్న ఘర్షణల్లో 25 మంది మృతి చెందారని పాక్...
మథురలో ఇక ప్రాచీన ప్రసాద వితరణే
10
ఉత్తర్ప్రదేశ్లోని మథురలో గల దేవాలయాల్లో ఇకపై భక్తులకు బహిరంగ మార్కెట్లో తయారయ్యే స్వీట్ల స్థానంలో ‘ప్రాచీన ప్రసాదం’ వితరణ చేయాలని స్థానిక హిందూ సంస్థ నిర్ణయించింది. ఆ...
స్వచ్ఛ భారత్ లో దేశవ్యాప్త గుర్తింపు సాధించిన నరసాపురం మహిళ
14
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం పొన్నపల్లి వార్డులోని సత్యనారాయణమ్మ పరిశుభ్రత విషయంలో చేసిన ప్రయత్నాలు స్వచ్ఛ భారత్ దృష్టిని ఆకర్షించాయి. దివ్యాంగురాలైన ఆ మత్స్యకార మహిళ ఇద్దరు...
ప్రజ్ఞాన్ రోవర్కు చిక్కిన భారీ పురాతన బిలం
18
ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించిన చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి తాజాగా మరో కీలక విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)...
28న ఆధ్యాత్మిక అవగాహన సదస్సు
28
అన్నమయ్య జిల్లాలోని దేవాలయాల పాలకవర్గ చైర్మన్లు, ఇన్స్పెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఆలయ ఉద్యోగులు, పూజారులకు ఈ నెల 28వ తేదీన ఆధ్యాత్మిక అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు జిల్లా...
ఇప్పిలిలో పురాతన శిలాశాసనం
26
శ్రీకాకుళం జిల్లాలోని ఇప్పిలి గ్రామంలో పురాతన శిలాశాసనం బయల్పడింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా పర్యాటకాధికారి కె.నారాయణరావు అక్కడకు చేరుకున్నారు. ఈ వివరాలను పురావస్తుశాఖ అధికారులకు అందజేశారు....