News

ఐరాసలో రామచరితమానస్‌ను వినిపించనున్న మోరారీ బాపు

51views

ప్రఖ్యాత ఆధ్మాతిక గురువు, గుజరాత్‌కు చెందిన మోరారీ బాపు ఐక్యరాజ్య సమితిలో మొదటిసారిగా రామచరితమానస్‌ కథను వినిపించనున్నారు. న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో తొమ్మిది రోజు పాటు రామ కథా పఠనం చేయనున్నట్లు శనివారం ఆయన పీటీఐతో పేర్కొన్నారు. నేటి ప్రపంచానికి సత్యం, ప్రేమ, కరుణ అత్యవసరమని, వీటి గురించి రామచరితమానస్‌ మాట్లాడుతుందని తెలిపారు. మతం, సంస్కృతి పరమైన అడ్డంకులను ధాటి ఇది ప్రపంచానికి సందేశాన్ని అందిస్తుందని వివరించారు. మోరారీ బాపు ఇప్పటి వరకూ శ్రీలంక, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, కెన్యా, బ్రిటన్, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, జపాన్‌ దేశాల్లోని అనేక నగరాల్లో రామ కథను వినిపించారు.