నంద్యాల సంఘమిత్ర సేవా సమితి ప్రారంభించిన ప్లాస్టిక్ వ్యతిరేక ప్రచారం సానుకూల ఫలితాలను అందిస్తోంది. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం నంద్యాల వాసులు బాధ్యతగా కృషి చేస్తున్నారు. స్థానిక పద్మావతినగర్లోని శ్రీకృష్ణ మందిరంలో సంఘమిత్ర సేవా సమితి ఏర్పాటు చేసిన 4వ చైతన్య సదస్సులో పట్టణవాసులు తమ విజయాలను పంచుకున్నారు.
తమ ఫంక్షన్ హాలులో జరిగే పెళ్లిళ్ళు, పుట్టిన రోజు వంటి వేడుకల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని సంఘమిత్ర క్రియాశీలక సభ్యులు, జయంతా వెజ్ వరల్డ్ నిర్వాహకులు సముద్రాల నాగ రాజయ్య తెలిపారు. ప్లాస్టిక్ కప్పులు, గ్లాసులను వాడడం లేదని తద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను పర్యావరణంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నామని..ఇది తమకు ఎంతో ఆనందకరంగా ఉందని ఆయన తెలిపారు.
శ్రీ కృష్ణ మందిరం నిర్వాహకులు సైతం ప్లాస్టిక్ రహిత జీవనం వైపు మళ్లేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా, తమ మందిరంలో జరగనున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో 600 మందికి పైగా భక్తులు పాల్గొంటారని..ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకుండా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. సదస్సులో పాల్గొన్న మహిళలు తమ అపార్ట్మెంట్లలో నిర్వహించే కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో స్టీలు గ్లాసులు, ప్లేట్లను ఉమ్మడిగా సమకూర్చుకున్న విషయాన్ని సభికుల దృష్టికి తీసుకొచ్చారు. అలాగే, ప్లాస్టిక్ కవర్ల స్థానంలో జనపనారతో తయారు చేసిన సంచులకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుల్లో సంఘమిత్ర కార్యవర్గ సభ్యులు పృథ్వీరాజ్ యాదవ్, శ్రీ కృష్ణ మందిరం కమిటీ సభ్యులు, పలువురు పర్యావరణ ప్రేమికులు, మాతృమూర్తులు పాల్గొన్నారు.
157
You Might Also Like
కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో అపచారం
10
తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఆల్బమ్ షూటింగ్ చేయడం కోసం ఏకంగా.. గర్భగుడిలోనే...
కుంభమేళాకు భయపడిన బ్రిటీష్ పాలకులు.. విప్లవగడ్డగా మారుతుందని..
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గల పవిత్ర త్రివేణీ సంగమంలో జరుగుతున్న కుంభమేళాలో కోట్లాదిమంది భక్తులు, స్వామీజీలు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అత్యంత భారీగా జరుగుతున్న కుంభమేళాను వీక్షించేందుకు, సనాతన ధర్మం...
సిమెంటుకు హలాల్ ధ్రువీకరణ అవసరమా : సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్
22
ఇనప కడ్డీలు, సిమెంట్ వంటి ఉత్పత్తులకు హలాల్ ధ్రువీకరణ అవసరమా అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు ఎదుట ప్రశ్న లేవనెత్తారు. ఉత్తరప్రదేశ్ లో హలాల్...
ఒడిషాలో వెలుగు చూసిన పురావస్తు అవశేషాలు
ఒడిషా జాజ్పూర్ జిల్లా రత్నగిరిలో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఎఎస్ఐ) జరుపుతున్న తవ్వకాల్లో విలువైన అవశేషాలు లభించాయి. పురాతన బౌద్ధ కళాఖండాలు, ఆ ప్రాంతం ఒకప్పుడు...
ఆలయ భూముల ఆక్రమించి చర్చి నిర్మాణం
27
దేవస్థాన భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దేవదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్(ఆర్జేసీ) ఎస్.చంద్రశేఖర్ ఆజాద్ హెచ్చరించారు. ప్రకాశం జిల్లా పామూరు మండల కేంద్రమైన...