పూరీ జగన్నాథుని రత్నభాండాగారం రహస్య గదిలో వెలకట్టలేని సంపద ఉంది. ఆయుధాలు కూడా ఉన్నాయని భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి కటక్లోని తన నివాసంలో ఒక టీవీ ఛానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… తాము రహస్యగది నుంచి తాత్కాలిక ఖజనాకు తరలించిన సంపద వివరాలు బహిర్గతం చేయరాదని, చూసింది మనసులో ఉంచుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందులో స్వామి ఆభరణాలతోపాటు యుద్ధాస్త్రాలున్నాయని, ఈ సామగ్రి భద్రంగా ఖజనాలో ఉంచి సీల్ చేయించామని, ఇదంతా వీడియో తీయించామన్నారు. పురావస్తుశాఖ (ఏఎస్ఐ) చేపట్టనున్న రత్నభాండాగారం మరమ్మతులకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమన్నారు. ఈ పనులు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు జరుగుతాయన్నారు. రహస్యగదిలో సొరంగ మార్గం అన్వేషణకు సంబంధించి పనులు పూర్తయిన తర్వాత సంఘం సమావేశమవుతుందన్నారు.. లేజర్ స్కానింగ్ చేయించడానికి మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. సంపద లెక్కింపు భాండాగారం మరమ్మతుల తర్వాతే జరుగుతుందని జస్టిస్ రథ్ పునరుద్ఘాటించారు.
66
You Might Also Like
తిరుమలలో ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’ ల్యాబ్
52
తిరుమలలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రాష్ట్ర స్థాయి ఆరోగ్య ప్రయోగశాలను ఏర్పాటు చేసేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సిద్ధమైంది....
ఇంద్రకీలాద్రిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించిన డిప్యూటీ సీఎం
34
గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో అపచారం జరిగినందుకు గాను ఉపముఖ్యమంత్రి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా ఇవాళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి...
పుణె విమానాశ్రయానికి సంత్ తుకారాం పేరు
43
పుణెలోని లెహగావ్ విమానాశ్రయం పేరు మారనుంది. దీనికి 'జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్' గా పేరు మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
సంఘకార్యమే ప్రాణం.. వసుధైక కుటుంబమే ధ్యేయం..
సంఘకార్యాన్ని ఆజీవన పర్యంతం మోసి, డాక్టర్ జీ తత్వరూపంగా నిలిచి, భరతమాత ఋణం తీర్చుకోవటమే ధ్యేయంగా జీవితాన్ని సాగించి పరమాత్మలో ఐక్యమైన మల్లాపురం భీష్మాచారి ప్రతి ఒక్కరికీ...
ఆలయ నిర్వహణ సాధువుల పర్యవేక్షణలో వుండాలి: శ్రీశ్రీ రవిశంకర్
39
తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి క్షమించరాని నేరం అని, హిందువుల హిందువులు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారని పేర్కొంటూ మార్కెట్లో లభించే నెయ్యి సంగతేంటని ఆధ్మాత్మిక గురువు,...
చంద్రుడిపై రయ్ రయ్మంటూ.. ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణించవచ్చు..
53
చంద్రుడిపై పరిశోధనలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు చంద్రుడిపై ల్యాండ్ అయిన చోటనే పరిశోధనలకు వీలుండేది. ఇప్పుడు ల్యాండ్ అయిన చోట నుంచి వ్యోమగాములు కొంత దూరం...