షిల్లాంగ్ రామకృష్ణ ఆశ్రమంలో ఒకరోజు ఆసక్తికరమైన సంఘటన జరిగింది. మఠానికి ఆనుకొని ఓ కుటుంబం ఉండేది. ఓ రోజు సాధు బృందమంతా రాత్రి భోజనం చేస్తున్న సమయంలో హఠాత్తుగా పక్కింటి పెద్దాయన ప్రత్యక్షమయ్యాడు. స్వాములందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడా గృహస్థు ‘క్షమించండి! స్వామీజీ ఇలా రావటం పొరపాటే! కానీ మా ఆవిడతో చిన్న వివాదం తలెత్తింది. అందుకే ఇలా వచ్చాను!’ అని వివరించాడు. ‘ఏమిటది?’ ఆశ్చర్యంగా ప్రశ్నించారు స్వామీజీలు. ‘మీ భోజనాల గదికి కొన్ని అడుగుల దూరంలోనే మా ఇల్లు ఉన్నందున మీ మాటలన్నీ వినిపిస్తుంటాయి. మీరంతా తినేటప్పుడు చాలా సరదాగా మాట్లాడుతుంటారు. ఆ నవ్వులు, కోలాహాలు విని మా ఆవిడ ‘స్వామీజీలు రుచికరమైన అనేక వంటలతో భోజనం చేస్తుంటారేమో! అందుకే వాళ్లు చాలా ఉల్లాసంగా ఉంటారు’ అంటుంటుంది. నేనేమో ‘లేదు! ఆశ్రమం ఆర్థికంగా అంత మంచి స్థితిలో లేదు. అన్ని రకాల వంటలు చేసుకునే అవకాశం లేదు. అలాంటప్పుడు స్వామీజీలు అద్భుతమైన పదార్థాలు ఎలా తినగలరు? వాళ్ల తత్త్వం అలాంటిది. సహజంగానే సంతోషంగా ఉంటారు’- అని చెబుతుంటాను. కానీ మా ఆవిడ నా మాటలను అంగీకరించటం లేదు. అందువల్ల నేను స్వయంగా చూసి తెలుసుకొని, నా భార్యకి అసలు సంగతేమిటో చెబుతామని వచ్చాను’ అన్నాడు. అప్పుడు స్వామీజీలందరూ మరింత ఉల్లాసంగా ఆయనను కూడా తమతో కలిసి తినమని ఆహ్వానించి, తమతో పాటు సాధారణ భోజనమే వడ్డించారు. ‘ఆనందం అనేది పరిస్థితుల్లో, పదార్థాల్లో ఉండదు. మన మనసులో ఉండాలి. ఆధ్యాత్మికతకు అదే ఆనవాలు’ అని నిరూపించారు. భర్త అనుభవపూర్వకంగా చూసి చెప్పగా.. ఆ గృహణికి విషయం బోధపడింది. అప్పటి నుంచి ప్రత్యేక దినాల్లో స్వయంగా తనే మిఠాయిలు, ఇతర ప్రత్యేక వంటకాలు తయారు చేసి ఆశ్రమానికి పంపిస్తుండేది.
217views
You Might Also Like
తిరుమల కొండపై టీటీడీ తిరునామధారణ సేవ
4
తిరుమల తిరుపతి అనగానే భక్తులకు గుర్తొచ్చేది వేంకటేశ్వరస్వామి దివ్య స్వరూపం, ఆ తర్వాత లడ్డూ ప్రసాదం. తిరుమల వెళ్లిన ప్రతి భక్తుడూ ఇష్టపడే మరో విషయం ఏమిటంటే...
అరసవల్లి సిరిమానోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు
5
శ్రీకాకుళం నగరంలో పదేళ్లకోసారి ప్రతిష్టాత్మకంగా జరిగే అరసవల్లి అసిరితల్లి సిరిమానోత్సవం నిర్వ హణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. స్థానిక మున్సిపల్...
నంద్యాలలో వైభవంగా “వైభవ భారత్” కార్యక్రమం
5
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది కార్యక్రమాల్లో భాగంగా “వైభవ భారత్” పేరుతో ప్రముఖుల సమావేశం నంద్యాలలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో...
వచనాల ఛాంపియన్
పుస్తకం వైపు చూడకుండా చదివిన పాఠాలు తిరిగి అప్పచెప్పడం మనందరికీ వచ్చు. కానీ ఒకటి కాదు రెండు కాదు వెయ్యికి పైగా వచనాలను చూడకుండా పఠించడం ఎక్కడైనా...
నవధాన్యాలతో జవసత్వాలు
6
వ్యవసాయమే జీవనాధారమైన రైతులు గతంలో ఆరుగాలం కష్టపడి ఏటా మూడు పంటలు పండించేవారు. సార్వా, దాళ్వా వరిసాగే కాకుండా దాళ్వా పంట అనంతరం ఆరుతడి పంటలుగా మినుము,...
ప్రాకృతం నుండి తెలుగు భాష.. బ్రాహ్మి నుండి దాని లిపి పరిణామం
నా మాతృభాష తెలుగు కాబట్టి ప్రాకృత భాష నుండి దాని మూలాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నాకు సహజంగానే ఉంటుంది. అదేవిధంగా, తెలుగు లిపి బ్రాహ్మీ లిపి...





