మనందరికీ తెలిసిన 3 చేపల కథలో- చెరువు ఎండిపోతోందని గ్రహించిన మొదటి చేప- ఆపద వచ్చేట్లుంది.. మరో చోటుకు వెళ్దామంది. రెండోది- ప్రమాదం వచ్చినప్పడు తప్పించుకోవచ్చులెమ్మంది. మూడో చేప- ఆమాత్రానికే దిగులెందుకు అంది. మొదటిది మరో చెరువులోకి వెళ్లగా, రెండోది ఆపద వచ్చాక తప్పించుకుంది. తాపీగా ఉన్న మూడో చేప పట్టుబడింది. మహాభారతం శాంతిపర్వంలో భీష్ముడు చెప్పిన ఈ కథలో అనాగత విధాత, ప్రత్యున్నమతి, దీర్ఘసూత్రి- అంటూ ఆ చేపలకు పేర్లు పెట్టి.. వాటి తత్వాలను నిర్వచించాడు. మనలోనూ మూడు రకాల వాళ్లుంటారు. మొదటి రకంలా మానసిక అలజడులూ, ఆందోళనలను ముందే పసిగట్టి అప్రమత్తమై ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తారు. రెండో రకంవారు ఆపద కలిగి నప్పుడు సమయస్ఫూర్తితో అధిగమించి దైవాన్ని ఆశ్రయిస్తారు. మూడో రకంవారు నిర్లక్ష్యంతో కాలయాపన చేస్తూ మరణం సమీపించే వరకూ పరమాత్ముడి గురించిన ఊసే లేకుండా గడిపేస్తారు. ఈ చేపల్లో ఏ చేపలా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి.
360views
You Might Also Like
దేశ భక్తి కలిగిన పౌరులను తీర్చిదిద్దడమే విద్యాభారతి లక్ష్యం : గోవింద్ మహంత్
43
న్యూఢిల్లీ : నోయిడా కేంద్రంగా విద్యా భారతికి చెందిన అఖిల భారత ప్రచార విభాగ్, అభిలేఖాగార్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి....
కన్వర్ యాత్రికులకు సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు
36
హరిద్వార్ : శ్రావణ మాసం రాగానే హరిద్వార్ భక్తి సాగరంగా మారిపోతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది శివభక్తులు కావడీలతో పవిత్రమైన గంగా జలాన్ని...
విశాఖపట్నం గుడిలోవ కేంద్రంగా ’’ఆరెస్సెస్ అఖిల భారతీయ సమన్వయ్ బైఠక్’’
41
విశాఖ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ సమన్వయ్ బైఠక్ ఈ సారి ఆంధ్రప్రదేశ్ లోని గుడిలోవలో జరగనుంది. ఈ నెల 19 నుంచి 21...
ఉగ్రవాది లతీఫ్ భట్ సమాచారం ఇస్తే 15 లక్షలు… జమ్మూలో పోస్టర్లు
15
లష్కరే తోయబా సంస్థకు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాది లతీఫ్ భట్ విషయంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. జూలై 22 న పోలీసు అధికారి...
విజ్ఞాన రంగంలో భారత్కు మరో గౌరవం.. హాకింగ్స్ సరసన భారత సైంటిస్ట్ దీపక్ ధర్
49
భారతదేశపు ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, ఐఐఎన్ఎస్ఏ ప్రొఫెసర్ దీపక్ ధర్ అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. భౌతిక శాస్త్ర రంగంలో అత్యున్నత పురస్కారాలలో ఒకటిగా భావించే 2026...
ముంబైలో మార్మోగుతున్న ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలు
40
మహారాష్ట్రలోని ముంబై నగరంలో వినాయక చవితి వేడుకలకు రంగం సిద్ధమైంది. గణేష్ ఆగమన్ వేడుకల ప్రారంభంతో ముంబై వీధులు భక్తిభావంతో నిండిపోతున్నాయి. 2026 సెప్టెంబర్ 14న ఘనంగా...





