మనందరికీ తెలిసిన 3 చేపల కథలో- చెరువు ఎండిపోతోందని గ్రహించిన మొదటి చేప- ఆపద వచ్చేట్లుంది.. మరో చోటుకు వెళ్దామంది. రెండోది- ప్రమాదం వచ్చినప్పడు తప్పించుకోవచ్చులెమ్మంది. మూడో చేప- ఆమాత్రానికే దిగులెందుకు అంది. మొదటిది మరో చెరువులోకి వెళ్లగా, రెండోది ఆపద వచ్చాక తప్పించుకుంది. తాపీగా ఉన్న మూడో చేప పట్టుబడింది. మహాభారతం శాంతిపర్వంలో భీష్ముడు చెప్పిన ఈ కథలో అనాగత విధాత, ప్రత్యున్నమతి, దీర్ఘసూత్రి- అంటూ ఆ చేపలకు పేర్లు పెట్టి.. వాటి తత్వాలను నిర్వచించాడు. మనలోనూ మూడు రకాల వాళ్లుంటారు. మొదటి రకంలా మానసిక అలజడులూ, ఆందోళనలను ముందే పసిగట్టి అప్రమత్తమై ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తారు. రెండో రకంవారు ఆపద కలిగి నప్పుడు సమయస్ఫూర్తితో అధిగమించి దైవాన్ని ఆశ్రయిస్తారు. మూడో రకంవారు నిర్లక్ష్యంతో కాలయాపన చేస్తూ మరణం సమీపించే వరకూ పరమాత్ముడి గురించిన ఊసే లేకుండా గడిపేస్తారు. ఈ చేపల్లో ఏ చేపలా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి.
331views
You Might Also Like
నక్సల్స్ ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి.. తిరిగి వచ్చేస్తున్న ప్రజలు
28
కేంద్ర ప్రభుత్వం ‘‘ఆపరేషన్ కగార్’’ తో నక్సలిజం కకావికలమైంది. చాలా మంది నక్సల్స్ అగ్రనేతలు ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. మరి కొందరు లొంగిపోయారు. మిగిలిన నక్సల్స్...
‘‘ఖారిజీ మదర్సా’’ దృష్టి పెట్టిన బెంగాల్ సర్కార్
42
బెంగాల్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు లేని మదర్సాలపై దృష్టి నిలిపింది. ఇందులో భాగంగా ఆ మదర్సాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తోంది. అసలు అవి ఎలా...
కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎనిమిది గుణాలు అవసరం : రవీంద్ర జోషి
36
కుటుంబ వ్యవస్థ, కుటుంబ విలువల కారణంగానే భారతీయ సంస్కృతి ఇప్పటికీ సురక్షితంగానే వుందని అఖిల భారతీయ కుటుంబ ప్రబోధన్ సంయోజక్ రవీంద్ర జోషి అన్నారు. భారత్ లో...
“మా DNA, భారతదేశ DNA ఒక్కటే”.. భారత్తో చారిత్రక బంధాన్ని గుర్తుచేసిన తాలిబాన్ మంత్రి
36
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వ వ్యవసాయ, నీటిపారుదల, పశుసంవర్ధక శాఖ మంత్రి మౌలానా అతావుల్లా ఒమారీ భారత్-ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్...
మియావాకి పద్ధతిలో మొక్కలు నాటి గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన అహ్మదాబాద్
41
పర్యావరణ పరిరక్షణలో గుజరాత్లోని అహ్మదాబాద్ నగరం అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. భారీ స్థాయిలో నిర్వహించిన ఒక వినూత్న ప్లాంటేషన్ డ్రైవ్ ద్వారా సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్...
తిరుమల సంప్రదాయాలతో రాజకీయాలు వద్దు : డీకే శివకుమార్కు భానుప్రకాష్ రెడ్డి సూచన
35
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలపై రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్పష్టం...





