News

అంతరిక్ష శాస్త్రవేత్త సుబ్బారావుకు ఆర్యభట్ట అవార్డు

304views

తెనాలికి చెందిన ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త, హైదరాబాద్‌లోని అనంత్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ/చైర్మన్‌ డాక్టర్‌ పావులూరి సుబ్బారావు ప్రతిష్టాత్మక గౌరవం అందుకున్నారు. భారతదేశంలో ఆస్త్రోనాటిక్స్‌ ప్రమోషన్స్‌కు డాక్టర్‌ సుబ్బారావు చేసిన జీవితకాల అద్భుత సహకారానికి గుర్తింపుగా ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ),‘ఆర్యభట్ట’ అవార్డు, ‘డిస్టింగ్విష్డ్‌ ఫెలో’ బిరుదును ప్రదానం చేసింది. గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో బుధవారం ఏర్పాటైన ప్రత్యేక సభలో ఏఎస్‌ఐ అధ్యక్షుడు, ఇస్త్రో చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌, ఇస్రో మాజీ చైర్మన్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ చేతులమీదుగా స్వీకరించారు. డాక్టర్‌ సుబ్బారావు తొలుత ఇస్రోలో శాస్త్రవేత్తగా చేశారు. అత్యంత అధునాతన ఏవియానిక్స్‌ను స్వదేశీయంగా రూపొందించి, అభివృద్ధి చేయాలనే భావనతో 1992లో అనంత్‌ టెక్నాలజీస్‌ను స్థాపించారు. ప్రస్తుతం హైదరాబాద్‌, బెంగళూరు, తిరువనంతపురంలో గల అనంత్‌ టెక్నాలజీస్‌ సంస్థల్లో 1600 పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. భారత అంతరిక్ష కార్యక్రమాల కోసం ఇప్పటివరకు 98 ఉపగ్రహాలు, 78 లాంచ్‌ వెహికల్స్‌కు డాక్టర్‌ సుబ్బారావు నేతృత్వంలోని అనంత్‌ సంస్థ సహకరించింది.