
382views
తిరుమలలో యాత్రికుల వసతి సముదాయాల (పీఏసీ)లో మెటల్ డిటెక్టర్లు, లగేజీ స్కానింగ్ పరికరాలు మూలనపడ్డాయి. తిరుమలకు రోజూ లక్షల్లో భక్తులు శ్రీవారి దర్శనార్థం వస్తుంటారు. ఈ నేపథ్యంలో అలిపిరి తనిఖీ కేంద్రం, శ్రీవారిమెట్టు మార్గాల్లోనూ భక్తుల లగేజీని తనిఖీచేసి పంపుతుంటారు. అయినా మద్యం, ఇతర మత్తుపదార్థాలు పైకి చేరుకుంటున్నాయి.




