News

అధికారంలోకి వస్తే పౌరసత్వ చట్టం రద్దు ; కాంగ్రెస్ నేత పవన్ ఖేరా

280views

లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పౌరసత్వ (సవరణ) చట్టం, 2019ని రద్దు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా వెల్లడించారు. గత ఏడాది మే నుంచి జాతి కలహాలు జరుగుతున్న మణిపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించకపోవడంపై ఆయన మండిపడ్డారు.

ఇక్కడ విలేకరుల సమావేశంలో ఖేరా మాట్లాడుతూ, “1971 కటాఫ్ తేదీ అస్సాంకు పవిత్రమైనది. కానీ సీఏఏ దాన్ని తొలగిస్తుంది. 2014 కొత్త కట్-ఆఫ్ తేదీ అవుతుంది. ఇది అస్సాం ఆందోళనలో అమరవీరుల త్యాగాలను అగౌరవపరుస్తుంది ” అన్నారు. అస్సాం ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి ప్రవేశించే వ్యక్తులకు భారత పౌరసత్వం మంజూరు చేయడానికి మార్చి 25, 1971 నాటి కటాఫ్ తేదీని ఆయన ప్రస్తావించారు.