
శైవక్షేత్రం దక్షిణ కాశీగా పేరొందిన శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఏటా నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటున్న పాలకులు, అధికారులు ఆ తర్వాత కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉత్సవాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మక ఘట్టం స్వామి చక్రతీర్థ స్నానం. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. అయితే వంశధార నదికి కనీసం రహదారి లేకపోవడం గమనార్హం. ఏటా అధికారులు వసతుల కల్పనకు అంచనాలు వేయడం, తాత్కాలిక చర్యలతో మమ అనిపించడం పరిపాటిగా మారింది.
సమస్యల తిష్ఠ ఇలా..
ఏటా హడావుడే..
ఈ నెల 8 మహాశివరాత్రి, 9న పడియ, 10న మహాపడియ, 11న స్వామి చక్రతీర్థ స్నానం కార్యక్రమాలు జరుగుతాయి. నేటికి ఏడు రోజులు మాత్రమే ఉంది అయినా పనులు ముందుకు సాగడం లేదు. ఉత్సవాలు దగ్గర పడే సమయంలో అధికారులు హడావుడి మాత్రం ఏటా కొనసాగుతుంది.
ఉన్నతాధికారులకు నివేదించాం…
భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. గత పొరపాట్లు పునరావృతం కాకుండా చూస్తున్నాం. చక్రతీర్థ స్నానాలకు వెళ్లే రహదారిలో దేవాదాయశాఖ ద్వారా తాత్కాలికంగా పనులు చేయిస్తున్నాం. అన్ని శాఖల అధికారుల సహకారంతో సమస్యలు పరిష్కరిస్తాం.-పి.ప్రభాకరరావు, ఈవో, శ్రీముఖలింగేశ్వరస్వామి క్షేత్రం





