News

త్వరలో భారత్ టూరిజం ఇన్వెస్టర్స్ కాంక్లేవ్

407views

ధరంశాల: పర్యాటక రంగంలో దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు త్వరలో మన దేశంలో “భారత్ టూరిజం ఇన్వెస్టర్స్ కాంక్లేవ్” నిర్వహించనున్నట్టు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధరంశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర పర్యాటక మంత్రుల జాతీయ సదస్సులో ఆయన ముగింపు ప్రసంగం చేస్తూ ఇలాంటి సదస్సులు మీ రాష్ట్రాల్లో కూడా నిర్వహించాలంటూ మంత్రులకు సూచించారు.

రాష్ట్రాల రాజధానుల్లో కేంద్ర టూరిజం అధికారులను నియమిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. గైడ్స్, రవాణా, హోటల్స్, అధికారులతో సమన్వయం చేసుకుంటూ వారు పని చేస్తారని వెల్లడించారు. జాతీయ టూరిజం పాలసీకి అందరి మద్దతు కావాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. అందరం కలిసి ఒకే గొడుగు కింద పని చేద్దామని పిలుపునిచ్చారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి