
తమిళనాడు: ఒక పాస్టర్ అద్దెకు తీసుకున్న స్థలంలో చర్చి నిర్మించాడు. అయితే, ఈ నిర్మాణంలో 87 ఏళ్ళ హిందువుని భూమిని కూడా ఆక్రమించాడు. పూర్వపరాలు పరిశీలించిన మద్రాస్ హైకోర్టు ఆ వృద్ధుని ఆస్తిని ఆక్రమించిన చర్చిని తొలగించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
చెన్నై నివాసి అయిన ఈశ్వరన్ తన ఆస్తి కోసం కోర్టును ఆశ్రయించాడు. ఈశ్వరన్ సోదరుడు 1960లో 3,800 చ.అ.ల ఆస్తిని కొనుగోలు చేశాడు. తర్వాత అతను మరణించాడు. ఈశ్వరన్కు వారసత్వంగా ఆ ఆస్తి వచ్చింది. కానీ, ఎకరం ఆస్తిని భూసేకరణ చట్టం కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
అయితే, దానిని సవాల్ చేస్తూ ఈశ్వరన్ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్వాధీనాన్ని రద్దు చేసింది. ఆ ఆస్తికి ఈశ్వరన్ ఏకైక యజమాని కాబట్టి భూ పత్రాలను మార్చాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. ఇంతలో, ఈ గందరగోళాన్ని ఉపయోగించుకుని ధనశేఖర, పాల్ మోసెస్ ఆ ఆస్తిని ఆక్రమించి చర్చిని నిర్మించారు.
ప్రభుత్వ అధికారులకు బాధితుడు ఈశ్వరన్ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఆక్రమణదారులపై చర్యలు తీసుకోలేదు. దీంతో ఆ వృద్ధుడు కోర్టుకు వెళ్ళాడు. ఈ వ్యవహారం ఇప్పటికే ఒకసారి కోర్టుకు వెళ్ళగా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించినట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా, పాల్ మోసెస్ దాఖలు చేసిన ఇతర కేసులు కూడా కోర్టు కొట్టివేసింది. కానీ, అతను ఆక్రమించిన ఈశ్వరన్ ఆస్తిని విడిచిపెట్టలేదు. దీంతోనే ఈశ్వరన్ మళ్ళీ కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. ఈసారి తహశీల్దార్ ఆస్తిని తనిఖీ చేసి, ఈశ్వరన్ పేరు మీద పట్టా ఇచ్చారని, ఇది ఆస్తికి ఏకైక యజమాని అని స్పష్టంగా చూపుతుందని కోర్టు పేర్కొంది.
ఈ ఆస్తికి సంబంధించి ధనశేఖరన్ వైపు నుంచి ఎలాంటి ఆటంకాలు ఉండవని హామీ ఇచ్చిన తర్వాత, ఈశ్వరన్ను న్యాయపరంగా సవాలు చేసే హక్కు పాల్ మోసెస్కు లేదని కోర్టు తీర్పు చెప్పింది. ఆక్రమణలను తొలగించి ఆస్తిని తిరిగి ఈశ్వరన్కు ఇవ్వాలని ప్రభుత్వ అధికారులను కోర్టు ఆదేశించింది.
Source: HINDU POST





