News

కేంద్ర పథకాలపై ప్ర‌చారం.. రికార్డ్ నెల‌కొల్పిన కుర్రోడు!

513views

ఉత్త‌రాఖండ్‌: ఉత్తరాఖండ్​ హల్ద్వానికి చెందిన వైభవ్​ పాండే వరల్డ్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించాడు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 65 కార్యక్రమాలను.. ఒకే రోజులో ఎనిమిది కేంద్రాల్లో వందల మందికి తెలిసేలా ప్రచారం చేశాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరు చూసి ముగ్ధుడైన వైభవ్​ పాండే.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన 65 కార్యక్రమాలపై అధ్యయనం చేశాడు. వీటితో పొందే లబ్ధిని సామాన్య ప్రజలకు వివరించాలని నిర్ణయించాడు.

ఆరు ప్రైవేట్​ పాఠశాలలతో సహా ఎనిమిది కేంద్రాల్లో ప్రచారం నిర్వహించాడు వైభవ్ పాండే. అతడు​ ప్రచారం చేసిన 65 కార్యక్రమాల్లో పరీక్షా పే చర్చా, మన్​ కీ బాత్​, మేక్​ ఇన్​ ఇండియా, స్కిల్​ ఇండియా, డిజిటల్​ ఇండియా ఉన్నాయి. డ్రైవర్లు, పాఠశాల ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలకు కూడా ఈ కార్యక్రమాల ద్వారా పొందే లబ్ధిని వివరించాడు. దీంతో పాటు వోకల్​ ఫర్​ లోకల్​ స్ఫూర్తితో నగర ప్రజల కోసం వర్చువల్​ సెషన్​ను నిర్వహించాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి