
చెన్నై: భగవాన్ శ్రీరాముడు నాకు తెలియదని, తమిళనాడులో రామాలయాలు లేవంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు(టీఎన్) కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణిపై నెటిజన్లు మండిపడ్డారు.
ఒక న్యూస్ ఛానల్తో.. తనకు భగవాన్ రామ్ తెలియదని, తమిళనాడులో ఆయనకు దేవాలయాలు లేవని తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి పేర్కొన్న విషయం విదితమే.
జాతీయ రాజకీయాల్లోకి వచ్చే వరకు భగవాన్ రామ్ గురించి తనకు తెలియదని మొదట్లో ఒకవైపు పేర్కొన్న ఆమె, “నేను రామాయణం చదివాను, మహాభారతం చదివాను, అలా నాకు తెలుసు” అని తన సొంత ప్రకటనకు విరుద్ధంగా చెప్పింది.
తమిళులను ఆరాధించే విషయానికి వస్తే “పూర్వీకులను ఖచ్చితంగా ఆరాధిస్తారు” అని ఆమె అన్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమిళులకు భగవాన్ రామ్ ఎంతో ముఖ్యమని, రామనాథపురం అనే జిల్లాకు ఆయన పేరు పెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాముడు ఈశ్వరుడిని పూజించిన రామేశ్వరం కూడా టీఎన్లోనే ఉందని ఎత్తి చూపడం ద్వారా ఆమెకు సరైన గుణపాఠం నేర్పినట్టయింది.
కొందరు భగవాన్ రామ్ కోసం టీఎన్లో నిర్మించిన పురాతన దేవాలయాల గురించి ట్విట్టర్లో పంచుకున్నారు, మరికొందరు జ్యోతిమణి అనే పేరు ఎప్పుడూ వినలేదని, ప్రముఖ తమిళ సాహిత్య రచన అయిన కంబరామాయణం భగవాన్ రామ్కు అంకితం చేయబడిందని సూచించారు.
Source: HINDU POST





