News

యూపీలో అత్యాధునిక స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన ప్రధాని

624views

త్తరప్రదేశ్లోని మీరట్లో రూ.700 కోట్లతో నిర్మించనున్న అత్యాధునిక ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రధాని మోడీ నేడు శంకుస్థాపన చేశారు. ఆ రాష్ట్ర CM యోగితో కలసి.. ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రధాని శంకుస్థాపన చేశారు. మీరట్లో దేశంలోనే అత్యాధునిక క్రీడా విశ్వవిద్యాలయంగా ఇది రూపొందుతోంది. యూపీలో ఇప్పటికే పలు ఎక్స్ ప్రెస్ వేలు, నీటి ప్రాజెక్టులు, కాశీ విశ్వనాథ్ కారిడార్ వంటి ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

నేరస్థులపై యోగి ప్రభుత్వం ఉక్కుపాదం – ప్రధాని మోడీ

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ యూపీలో గత పాలకులు నేరస్థులకు అండగా నిలిచారని, దీంతో వారు ఇష్టమొచ్చినట్లు ప్రజలతో ఆడుకున్నారని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. అక్రమాలను తట్టుకోలేక ప్రజలు సొంత ఇళ్లను వదులుకుని ఇతర ప్రాంతాలకు వలస పోవాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం సీఎం యోగి నేతృత్వంలోని ప్రభుత్వం నేరస్థులందరినీ జైళ్లలో పెట్టిందని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.