
633views
-
ఒక్క రోజే 40 వేలకుపైగా దర్శనం
తిరువనంతపురం: శబరిమలలో శనివారం రికార్డు స్థాయిలో 42,354 మంది దర్శనం చేసుకున్నట్టు కేరళ ప్రభుత్వం తెలిపింది. ఆలయంలోకి ప్రవేశించే భక్తులను శానిటైజ్ చేసి, మాస్కులు అందిస్తున్నారు. ఈ నెల తొమ్మిది నుంచి వర్చువల్ క్యూ పద్ధతిలో బుకింగ్ చేసుకునే విధానం పూర్తవుతుంది. వర్చువల్ బుకింగ్తో పాటు రోజూ దాదాపు 5వేల మంది భక్తులకు స్పాట్ బుకింగ్ అనుమతిస్తున్నారు. 26 వరకు ఆలయం తెరిచే ఉంటుంది. సంక్రాంతి సందర్భంగా 30న మళ్లీ శబరిమల ఆలయం తెరుచుకుంటుంది. జనవరి 20 వరకు భక్తులను అనుమతిస్తారు.





