
-
మత సంస్థల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించదు
-
హైకోర్టు కీలక తీర్పు
అమరావతి: దేవాలయాల్లో పొరుగు సేవల ఉద్యోగులను ఆప్కాస్ ద్వారా నియమించుకోవాలంటూ దేవాలయాల ఈవోలను ఆదేశిస్తూ ఆ శాఖ కమిషనర్ గతే డాది జులై 29న జారీ చేసిన మెమోను హైకోర్టు రద్దు చేసింది.
‘ఏపీ దేవాదాయచట్టం సెక్షన్ 18, 29, 29(3), 35 ప ప్రకారం హిందూమతాన్ని ఆచరించని వారిని దేవాలయాల్లో ఉద్యోగులుగా నియమించకూడదు. రిజర్వేషన్ అమలుచేస్తే అలాంటివారు నియమితులు కావొచ్చు.
దేవాలయాలు లేదా మతసంస్థల విషయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించదు. దేవాలయాలు, హిందూ సంస్థలు ప్రభుత్వానికి చెందినవి కావు. వాటిని అప్కాస్ పరిధిలోని తేవడానికి వీల్లేదు. ఇతర ఏజెన్సీల ద్వారా నియామకాలు జరిపేటప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కొనసాగిస్తూ.. హిందూ మతాన్ని విశ్వసిస్తున్న అణగారిన వర్గాల వ్యక్తులకు వర్తింపజేయవచ్చు. దేవాదాయ కమిషనర్ 2020 జులై 2న జారీచేసిన మెమోను రద్దు చేస్తున్నాం’ అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్రావు ఇటీవల తీర్పు ఇచ్చారు.
ఆప్కాస్ ద్వారా పొరుగు సేవల ఉద్యోగులను నియమించాలంటూ దేవాదాయశాఖ కమిషనర్ ఇచ్చిన మెమోను సవాలు చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన న్యాయవాది శ్యామప్రసాద్ ముఖర్జీ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది వి.వేణుగోపాలరావు, దేవాదాయశాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు.
Source: Eenadu





