
669views
పాలకొల్లు: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ పాస్టర్కు దుర్బుద్ది పుట్టింది. చందపర్రుకు చెందిన 50 ఏళ్ల నక్కా చిట్టిబాబు అనే పాస్టర్ వద్దకు లంకలకోడేరు చెందిన ఓ
యువతిని, ఆరోగ్య పరిస్థితి బాగోలేక ప్రార్థన చేయించడానికి ఆమె తల్లిదండ్రులు తీసుకువెళ్ళారు. ఇదే అదునుగా భావించిన పాస్టర్ రూ.6 లక్షల నగదు, 20 కాసుల బంగారంతో యువతిని తీసుకుపోయాడు. గన్నవరంలో ఉన్న నిందితుడి వద్ద నుంచి పోలీసులు రూ.5.50 లక్షల నగదు, 20 కాసుల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
Source: Way2news





