
ఝార్ఖండ్: మావోయిస్టుల చర్యలు ఆగడం లేదు. నిఘా దళాలు అప్రమత్తంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఝార్ఖండ్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ దళాదళాలు, స్థానిక పోలీసులు భారీ పేలుడు కుట్రను భగ్నం చేశారు. బుధవారం ఉదయం 15కిలో ఐఈడీని స్వాధీనం చేసుకొని, పెను దాడిని అడ్డుకున్నారు. నిఘా వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సీఆర్పీఎఫ్ 154 బెటాలియన్ దళం సభ్యులు, ఝార్ఖండ్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. అనుమానిత సీతూ ప్రాంతాంతో అణువణువూ పరిశీలించారు.
ఈ గాలింపులో మక్కాన్-చేచారియ మధ్య ఉన్న ఓ కల్వర్టు వద్ద 15 కిలోల శక్తిమంతమైన ఐఈడీ ఉన్నట్టు గుర్తించారు. బాంబ్ స్క్వాడ్ సాయంతో నిర్వీర్యం చేసి, స్వాధీనం చేసుకున్నట్టు సీఆర్పీఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. భద్రతా దళాలే లక్ష్యంగా మావోయిస్టులు ఈ పేలుడుకు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు స్పష్టమైన సమాచారాన్ని ఇచ్చాయని సీఆర్పీఎఫ్ వెల్లడించింది.





