
భోపాల్: ఇప్పటి వరకు ఆకుపచ్చ బెండకాయలనే చూశాం. తాజాగా ఎర్ర బెండకాయలు మన ఇంట్లోకి రానున్నాయి. మధ్యప్రదేశ్లోని ఓ రైతు సేంద్రియ పద్ధతిలో ఎర్ర బెండకాయలను పండిస్తూ.. లాభాలు గడిస్తున్నాడు. భోపాల్ జిల్లాలోని ఖజూరి కలాన్ ప్రాంతానికి చెందిన రైతు శ్రీశ్రీలాల్ రాజ్పుత్కు సేంద్రియ వ్యవసాయం అంటే భలే ఇష్టం. దీంతో తన పొలంలో ఎరుపు రంగులో ఉన్న బెండను సాగు చేశారు.
ఈ బెండ చాలా అరుదైన రకమని.. ప్రస్తుతం ఈ బెండకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉందని.. దిగుబడి కూడా ఆశాజనకంగా వచ్చిందని చెబుతున్నాడు. తాను వారణాసిలోని ఒక వ్యవసాయ పరిశోధన సంస్థ నుండి ఒక కిలో ఎర్ర బెండ విత్తనాలను కొనుగోలు చేసి, వాటిని జూలై మొదటి వారంలో విత్తుకున్నానని చెప్పారు. బెండమొక్కలు సుమారు 40 రోజుల్లో పెరగడం ప్రారంభమయ్యాయని తెలిపారు. అంతేకాదు, ఈ పంట సాగుచేస్తున్నప్పుడు హానికరమైన పురుగుమందులు ఉపయోగించలేదని రాజ్పుత్ చెప్పారు. కేవలం సేంద్రియ ఎరువులతో పంట పండిరచినట్టు తెలిపారు.
ఈ బెండకాయ ఎక్కువగా చలి ప్రాంతాల్లో సాగు చేయడానికి అనుకూలమని మీడియాకు తెలిపారు. అంతేకాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ బెండకాయను దేశంలో చాలా అరుదుగా సాగు చేస్తున్నారని చెప్పాడు. సాధారణ బెండకాయ కంటే ఎర్ర బెండ 5 నుంచి 7 రేట్లు ఖరీదు ఎక్కువని తెలిపారు.
SOURCE: Tv9





