
కరోనావైరస్ వ్యాప్తితో దేశం అట్టుడికిపోతున్నందున, ప్రజల కదలికలను పరిమితం చేయడానికి మరియు వైరస్ వ్యాప్తిని నిరోధించటానికి దేశం మొత్తం లాక్ డౌన్ చేయబడింది. వీటన్నిటి మధ్య, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇట్టేహాద్-ఉల్-ముస్లిమీన్ (AIMIM) ఎమ్మెల్యే మౌలానా ముఫ్తీ ఇస్మాయిల్ తన మద్దతుదారులతో మలేగావ్ ఆసుపత్రికి చేరుకున్నారు.అంతేకాక ఆసుపత్రి సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారు.
ముఫ్తీ మొహమ్మద్ ఇస్మాయిల్తో పాటు అతని 20-25 మంది అనుచరులు ఆసుపత్రిలోకి ప్రవేశించి సిబ్బందిని బెదిరించడం ప్రారంభించారు. వారు ఒక డాక్టర్ కిషోర్ డాంగేపై దాడి చేశారు. నివేదికల ప్రకారం, ఆసుపత్రి సిబ్బంది మరియు డాక్టర్ కిషోర్ డాంగే ఎమ్మెల్యే ఫోన్ తీసుకోకపోవడంతో వివాదం ప్రారంభమైంది.
ఈ సంవత్సరం ప్రారంభంలో, ఇద్దరు నిందితులు మలేగావ్లోని AIMIM నాయకుడు రిజ్వాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో నిందితుల్లో ఒకరు గాయపడ్డారు మరియు కోర్టు ఆదేశాల మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఆజ్ తక్ నివేదిక ప్రకారం, సరైన డాక్యుమెంటేషన్ లేకుండా తనను ఉంచడం పట్ల AIMIM ఎమ్మెల్యే కలత చెందారు.
#WATCH Maharashtra: Supporters of AIMIM MLA Mufti Mohammad Ismail abused a doctor at Malegaon General Hospital in Nashik. The MLA alleged that the doctor was delaying the discharge of two patients from the hospital. The MLA has been arrested. (Note-Abusive language) (25.03.2020) pic.twitter.com/DszaVCqmEi
— ANI (@ANI) March 26, 2020
కరోనావైరస్ వ్యాప్తి మధ్య డాక్టర్ మరియు వైద్య సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహించారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఘర్షణ తరువాత, ఎమ్మెల్యే మరియు అతని అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మొత్తం సిబ్బంది ఆసుపత్రి వెలుపల ధర్నాకి కూర్చున్నారు. అయితే, అత్యవసర సేవలు మరియు కరోనావైరస్ రోగులకు మాత్రం ఆసుపత్రి సిబ్బంది చికిత్స అందిస్తున్నారు.





