
775views
కర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బండారు నాగేశ్వరరావు గారి సహకారంతో కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ బడుగు బలహీన వర్గాలు నివసించే స్థానిక బైటిపేటలో ఉచితంగా హోమియో మందులు పంపిణీ చేయడం జరిగిందని సంఘమిత్ర కార్యదర్శి చిలుకూరి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర సభ్యులు,సంఘ కార్యకర్తలు శ్రీనివాస్, సురేంద్ర, గోపాల్ రెడ్డి, లోకేష్,వాసు, స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు.






