
574views
చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అభిప్రాయపడింది. ఢిల్లీలో శాంతి స్థాపనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆరెస్సెస్ సర్ కార్యవాహ శ్రీ సురేష్ భయ్యాజీ జోషి అన్నారు. గురువారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ ఘటనలపై స్పందించారు. హింసాత్మక ప్రాంతాల్లో శాంతి నెలకొల్పేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.





