NewsProgramms

అలరించిన ఆర్ ఎస్ ఎస్ పథ సంచలన్

935views

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా వికోట ఖండకు చెందిన ఆర్. ఎస్. ఎస్ స్వయంసేవకులు పథసంచలన్ (ROUTE MARCH) చెయ్యాలని నిశ్చయించారు. అనుకున్నదే తడవుగా కార్యకర్తలు ఖండలో ఉన్న మొత్తం తొమ్మిది మండలాలలోని కార్యకర్తలకు సమాచారం అందించారు. కార్యకర్తలు, స్వయంసేవకులందరూ పెద్ద ఎత్తున కదిలారు. కార్యక్రమంలో మొత్తం 235 మంది స్వయంసేవకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వక్తగా దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ శ్రీ ఆలె శ్యామ్ కుమార్ విచ్చేసి ప్రసంగించారు. స్వయంసేవకుల పథ సంచలనాన్ని నగర వాసులు ఆసక్తిగా తిలకించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.