News

యూపీలో మత మార్పిళ్ల కోసం చెన్నై నుంచి నగదు

268views

ఉత్తరప్రదేశ్‌లో గ్రామీణ ప్రజలను మతం మార్పించేందుకు తమిళనాడులోని చెన్నై నుంచి భారీగా నగదు పంపినట్లు ఆ రాష్ట్ర పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. యూపీలోని లఖింపూర్‌ ఖేరీ ప్రాంతంలో కుగ్రామాలకు చెందిన నిరుపేదలను బలవంతంగా క్రైస్తవ మతంలోకి మా ర్చారనే ఆరోపణలపై మతపెద్ద (పాస్టర్‌) వినోద్‌పాల్‌ సింగ్‌, ఆయన భార్య జ్యోతి, సహాయకులు అనంతరామ్‌, శుభకరన్‌, రమిత్‌లను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. వినోద్‌పాల్‌ సింగ్‌ను విచారించగా.. పేదలను మతం మార్చేందుకు, క్రైస్తవ సభలు జరిపేందుకు అతని బ్యాంకు ఖాతాల్లో చెన్నై నుంచి భారీఎత్తున నగదు జమ అయినట్లు తేలింది.