కర్నూలు జిల్లా నంద్యాలలో ఈనెల 22- 12 -19 ఆదివారం జరగబోవు దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించిన గోడ పత్రిక ఈరోజు 11 -12 -19 తేదీన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ ప్రాంత ప్రచారక్ శ్రీ విజయాదిత్య చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది.
సక్షం సేవా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో సక్షం నగర అధ్యక్షులు డాక్టర్ నేట్ల మహేష్ రెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న దివ్యాంగ సోదర, సోదరీ మణులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు.
జిల్లా సహ కార్యదర్శి శ్రీ బండారు సుబ్బారావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో దివ్యాంగులకు ఉపకరించు వివిధ ప్రభుత్వ పథకాలు, చదువు, వైద్య సేవలు మున్నగు ఎన్నో ఉపయోగకరమైన విషయాల గురించి చర్చించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విభాగ్ సంఘచాలక్ డాక్టర్ ఉదయ శంకర్, నగర సంఘచాలక్ శ్రీ చిలుకూరు శ్రీనివాస్, విభాగ్ ప్రచారక్ శ్రీ నవీన్, శ్రీ మురళీకృష్ణ, శ్రీ హరిబాబు, శ్రీ శ్రీనివాస్, శ్రీ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.