
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ యొక్క అఖిల భారత ప్రాంత ప్రచారక్ సమావేశంలో, సంఘ్ కార్యకలాపాల విస్తరణ, శతాబ్ది సంవత్సరానికి సన్నాహాలు ,వివిధ క్షేత్రాలలో సంఘ్ పని స్థితి వంటి మూడు ప్రధాన అంశాలు చర్చించబడ్డాయని అన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారత ప్రచారప్రముఖ్ సునీల్ అంబేకర్. ఢిల్లీలోని కేశవ కుంజ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు చెబుతూ ఈ సమావేశం ఎటువంటి ప్రతిపాదన లేదా నిర్ణయం తీసుకోవడానికి కాదు, ఆర్ఎస్ఎస్ పని దిశను నిర్ణయించడంపై దృష్టి పెట్టిందని అన్నారు. అఖిల భారత ప్రచారక్ సమావేశంలో ఇతర జాతీయ సమస్యలు కూడా చర్చించబడ్డాయి. ఇందులో మణిపూర్లో మైటీ , కుకి వర్గాల మధ్య శాంతిని పునరుద్ధరించడానికి సంఘ్ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఉన్నాయి. మణిపూర్లో పరిస్థితిని చర్చిస్తూ, ఆర్ఎస్ఎస్ రెండు వర్గాలతో సంభాషణను ముందుకు తీసుకెళ్తోందని, అనేక సానుకూల సంకేతాలు వెలువడ్డాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా, దేశంలోని వివిధ క్షేత్రాలలో, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలలో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ సంస్థాగత పనిని సమీక్షించారు., సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు (సంఘ కార్య శతాబ్ది) పూర్తయిన సందర్భంగా హిందూ సమాజం , మేల్కొలుపు, సామరస్యం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
21,879 మంది సేవకులు శిక్షణ పొందారు.
ఇటీవల జరిగిన శిక్షణా తరగతుల (సంఘ శిక్షా వర్గం) డేటాను అంబేకర్ పంచుకున్నారు ,ఈ సంవత్సరం మొత్తం 21,879 మంది స్వయం సేవకులు శిక్షణ పొందారని, వీరిలో 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 17,609 మంది ఉంటే, 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న 4,270 మంది స్వయంసేవకులు ఉన్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా 8,812 ప్రదేశాల నుండి ఈ తరగతుల్లో పాల్గొన్నారు. కేరళ, తమిళనాడు, కాశ్మీర్ మరియు గిరిజన ప్రాంతాల నుండి కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు అని వారు వివరించారు.
హిందూ సమావేశం నిర్వహించబడుతుంది.
సంఘ కార్య శతాబ్ది సంవత్సరంలో భాగంగా సంఘ కార్యకలాపాల గురించి సమాచారం ఇస్తూ, గ్రామీణ ప్రాంతాల్లోని మండలాల్లో , పట్టణ ప్రాంతాల్లోని వివిధ ప్రాంతలలో సమాజం కృషి ద్వారా హిందూ సమావేశాలు నిర్వహించబడతాయని ఆయన అన్నారు. 1,03,019 ప్రదేశాలలో హిందూ సమావేశాలు జరుగుతాయనీ, గ్రామీణ ప్రాంతాల్లోని 58964 మండలాల్లో , పట్టణ ప్రాంతాల్లోని 44055 స్థావరాలలో హిందూ సమావేశాలు నిర్వహించబడతాయి. అంటే మొత్తం 1,03,019 ప్రదేశాలలో హిందూ సమావేశాలు నిర్వహించబడతాయి అని పేర్కొన్నారు. అదే సమయంలో, 11,360 ప్రదేశాలలో సామాజిక సామరస్యాన్ని నిర్మించే కార్యకలాపాలు నిర్వహించబడతాయి. ఇది బ్లాక్ మరియు నగర స్థాయిలో జరుగుతుంది. దీనితో పాటు, దేశంలోని 924 జిల్లాల్లో ‘ఇంటింటికి సంప్రదింపు’ ప్రచారం నిర్వహించబడుతుంది. అని ఈ సందర్భంగా వారు చెప్పారు.
సమాజంలోని అన్ని వర్గాలను చేరుకోవడం
సమాజంలోని అన్ని వర్గాలను చేరుకోవడం, యువతను జాతి నిర్మాణ పనిలో భాగస్వామ్యం చేయడం సమాజాన్ని సహజంగా నిర్వహించడం సంఘ స్పష్టమైన లక్ష్యం అని అంబేకర్ అన్నారు. దీని కోసం, సమగ్రమైన క్రియాశీలకమైన ప్రణాళికను రూపొందించారు. దేశ పురోగతికి సమాజం విస్తృత భాగస్వామ్యం అవసరమని సంఘ్ విశ్వసిస్తుంది అదేవిధంగా సంస్థ ఈ దిశలో పనిచేస్తోంది అని చెప్పారు.
ఈ విలేకరుల సమావేశంలో సునీల్ అంబేకర్ తో పాటుగా, ఢిల్లీ ప్రాంత సంఘచాలక్ అనిల్ అగర్వాల్ కూడా కూడా పాల్గొన్నారు. కేశవ్ కుంజ్ కార్యాలయంలో జూలై 4 నుండి 6 వరకు జరిగిన అఖిల భారత ప్రాంత ప్రచారక్ సమావేశంలో ప్రాంత ప్రచారక్, అఖిల భారత కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు.





