
320views
యుద్ధాలు, సంఘర్షణలు, మానవ విలువల క్షీణత వంటి ఆధునికకాల ప్రపంచ సవాళ్లకు భారతీయ వేదాల్లో చూపిన అద్వైత సిద్ధాంతం పరిష్కారాలు చూపుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్లోని అశోక్నగర్ జిల్లా ఆనంద్పుర్ ధామ్ను ప్రధాని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానవులందరూ ఒకటే అనే ఆలోచన ప్రపంచానికి వెలుగునిస్తుందని, సంఘర్షణలను అంతం చేయగలదని తెలిపారు. రుషులు, పండితులు, సాధువులతో కూడిన భారతదేశం విపత్కర పరిస్థితులు ఎదురైనపుడల్లా సమాజానికి మార్గం చూపిందన్నారు. పూజ్య స్వామి అద్వైత్ ఆనంద్జీ మహరాజ్ జీవితం ఈ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఆనంద్పుర్ ధామ్ పర్యావరణ పరిరక్షణలోనూ గొప్ప పాత్ర పోషిస్తోందని ప్రధాని ప్రశంసించారు.





