News

ఆలయంపై గ్రనేడ్‌ విసిరిన వ్యక్తి ఎన్‌కౌంటర్‌

317views

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లాలో ఠాకుర్‌ద్వారా ఆలయంపై గ్రనేడ్‌తో దాడి చేసిన ఇద్దరు యువకులలో ఒకరిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. పంజాబ్‌ పోలీసులకు నిందితుల స్థావరానికి సంబంధించిన సమాచారం అందగానే వారు రంగంలోకి దిగారు. ఘటన జరిగిన 24 గంటల్లో ఒక నిందితుడిని ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు.

ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలను డీజీపీ గౌరవ్‌ యాదవ్‌ మీడియాకు తెలియజేశారు. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు అమృత్‌సర్‌ పోలీసులు ఘటన జరిగిన అనంతరం నిందితులను ట్రాక్‌ చేస్తూ వచ్చారన్నారు. ఈ నేపధ్యంలోనే వారిని గుర్తించగలిగారని, వారు రాజాసాంసీలో ప్రాంతంలో ఉన్నారని తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారని, వారిని చూడగానే నిందితులు తుపాకీతో కాల్పులు జరిపారన్నారు. ఈ ఘటనలో హెడ్‌ కానిస్టేబుల్‌ గురుప్రీత్‌ సింగ్‌కు గాయాలయ్యారన్నారు.

ఆత్మరణక్షణకు పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని ఈ నేపధ్యంలో ఒక నిందితునికి గాయాలయ్యాయని, అతనిని ఆస్పత్రికి తరలించామని, అక్కడ అతను మృతిచెందాడని గౌరవ్‌ యాదవ్‌ తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు. అతనిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారన్నారు.