
నంద్యాల జిల్లా, సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్ కొత్తపల్లె గ్రామంలో వివేకానంద అభ్యాసిక వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ, అభ్యాసికల మాధ్యమంగా, అభ్యాసకులే సాధనంగా సమాజంలో సనాతనధర్మ జాగృతి అనే లక్ష్య సాధన దిశగా యన్. కొత్తపల్లి వివేకానంద అభ్యాసిక ముందుకు వెళ్తోందని అన్నారు.
అభ్యాసిక వార్షికోత్సవంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యప్రదర్శనలు, పిరమిడ్లు లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు మన సంస్కృతీ సాంప్రదాయాల పరిమళాలు, విద్యార్థుల అభ్యాసనా నైపుణ్యాలు ప్రతి ఫలించాయి.ఒక వ్యవస్థీకృత పాఠశాల వార్షికోత్సవ అనే రీతిలో విద్యార్థుల ప్రదర్శనలు ఇవ్వడంతో పాటుపెద్ద సంఖ్యలో , తల్లిదండ్రులు, గ్రామస్తుల హాజరైయ్యారు
ఈ కార్యక్రమంలో సంఘమిత్ర కార్యవర్గ సభ్యులతో పాటు డాక్టర్ నెట్ల మహేశ్వరరెడ్డి, శ్రీ తాతి రెడ్డి నరేంద్ర రెడ్డి (కొత్తపల్లె ), శ్రీ గజ్జెల చెన్నారెడ్డి,(కొత్తపల్లె ), శ్రీమతి వై.ఎన్. సంద్య రాణి, శ్రీ రామ్ ప్రసాద్, శ్రీ మన్నవ వేణుగోపాల్, శ్రీ సంఘ శ్రీనివాసులు విద్యార్థుల తల్లిదండ్రులు మరియూ గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమం ఆద్యంతం ఆనందించారు.
ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహణకు కృషి చేసిన అభ్యాసిక ఉపాధ్యాయిని కుమారి రాణీ ప్రమీలను, సహకరించిన వారిని సంఘమిత్ర కార్యవర్గ సభ్యులు, పెద్దలు అభినందించారు.