
యూపీలో అక్రమ మసీదు నిర్మాణంపై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూపీలోని బండా ప్రాంతంలోని బంబేశ్వర్ పర్వతాన్ని హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. అక్కడ కొన్ని పుణ్యక్షేత్రాలున్నాయి. ఆ స్థలంలో అక్రమ మసీదు నిర్మాణం జరిగింది. ఈ కొండపైనే రాముడు ఒకానొక సమయంలో శివునికి అభిషేకం చేశాడని, అందుకే హిందువులకు ఈ కొండ అత్యంత పవిత్రమైందని స్థానికులు తెలిపారు. అక్కడే అక్రమ మసీదు నిర్మాణం చేశారని స్థానికులు అన్నారు.దీనిపై విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
భయంకరంగా దేశంలో కరోనా విజృంభిస్తున్న కారణంగా లాక్ డౌన్ విధించారని, అదే సమయంలో ముస్లిం ఛాందసులు అక్రమ మసీదు నిర్మించారు. దేశమంతా కరోనా మహమ్మారితో బాధపడుతుంటే వీరు ఇక్కడ అక్రమ మసీదు నిర్మాణం చేశారు. ఈ మసీదును వెంటనే కూల్చేయాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలని సీఎం యోగిని కోరారు.
మొదట ఓ చిన్న నిర్మాణంగా ప్రారంభమైందని, క్రమ క్రమంగా పూర్తి స్థాయి మసీదుగా రూపాంతరం చెందిందని స్థానికులు ప్రకటించారు. పెద్ద పెద్ద సమూహాలుగా ప్రతి శుక్రవారం ప్రార్థనలు కూడా చేస్తున్నారన్నారు. మొదట కొందరే ముస్లింలు వచ్చేవారని, ఇప్పుడు పెద్ద సమూహంలో వస్తున్నారని, ఇంత పెద్ద సంఖ్యలో ముస్లిం జనాభా పెరగడం వల్ల భద్రతా పరమైన సమస్యలు వస్తాయని అంటున్నారు.
పురాణాల ప్రకారం ఈ కొండపై వనవాస సమయంలో శ్రీరాముడు వుండేవాడని, శివ లింగాన్ని స్థాపించి, అభిషేకం కూడా చేశాడని నమ్ముతారు. బామ్ దేవ్ భోలేనాథ్ మందిర్ అని పిలుస్తారు. పుట్టన్ మహారాజ్ అని సాధువు ఇక్కడ ప్రతిరోజూ అర్చకత్వం నిర్వహిస్తారు. ఈ సాధువే మొట్ట మొదట అక్రమ మసీదు నిర్మాణాన్ని వ్యతిరేకించారు.





