
361views
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తిరుమలను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలంటూ సుప్రీంలో పాల్ పిటిషన్ వేశారు. శుక్రవారం ఆయన వేసిన పిటిషన్ సుప్రీంలో విచారణకు వచ్చింది. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. తిరుమలను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న పాల్ పిటిషన్ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఉన్నతన్యాయస్థానం వ్యాఖ్యానిస్తూ .. ఈ పిటిషన్ను కొట్టివేసింది.





