అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం కనుగొండ అటవీ ప్రాంతంలోని అభయాంజనేయస్వామి ఆలయం కూల్చివేత ఘటనలో నిందితులకు పేలుడు పదార్థాలు సరఫరా చేసిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ దర్బార్ కొండయ్యనాయుడు తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ములకలచెరువులోని కనుగొండ అటవీ ప్రాంతంలో ఈ నెల 14న అభయాంజనేయస్వామి ఆలయాన్ని కొందరు కూల్చేశారు. ఆలయ పూజారి విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. అదే ప్రాంతానికి చెందిన కనుగొండస్వామి ఆలయ పూజారి హరినాథ్యాదవ్ ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించారు. కనుగొండస్వామి ఆలయానికి భక్తులు రాకపోవడంతో కక్ష పెంచుకున్నాడన్నారు. దీంతో పాటు ప్రభుత్వం ఆలయాల్లో దూపదీప నైవేద్యాలకు అందించే రూ.10వేలు తన ఆలయానికి రాకుండా పోతుందని భావించాడు. అభయాంజనేయస్వామి ఆలయం లేకుంటే తన ఆలయానికి భక్తులు ఎక్కువగా రావడంతో పాటు ప్రభుత్వం నుంచి డబ్బు వస్తుందని ఈ నెల 14న కొందరితో కలిసి ఆలయానికి జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చేందుకు ప్రయత్నించాడు. అవి పనిచేయకపోవడంతో గునపాలతో ఆలయాన్ని ధ్వంసం చేయించినట్లు తేలిందన్నారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడైన హరినాథ్యాదవ్, లక్ష్మీనారాయణ, రాఘవాచారి, మధు, షేక్ ఇలాహీబాషా, మహేశ్వర్రెడ్డిని అరెస్టు చేసి రెండు జిలెటిన్ స్టిక్స్ సీజ్ చేశామన్నారు. వీరికి జిలెటిన్ స్టిక్స్ సరఫరా చేసింది శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం టి.సదుం గ్రామానికి చెందిన వెంకటనారాయణ (27), షేక్ ఈదుల్లా (24)గా గుర్తించారు. వీరిద్దరినీ అరెస్టు చేసి విచారణ చేశారు. వీరు తనకల్లు సమీపంలో మూతపడిన క్వారీలో ఉన్న షెడ్డులో జిలెటిన్ స్టిక్స్ సేకరించినట్లు తేలడంతో అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఆధిపత్యం కోసమే గుడిని ధ్వంసం చేశారని, ఇందులో ఎలాంటి మతపరమైన అంశాలు లేవని డీఎస్పీ తెలిపారు. అభయాంజనేయస్వామి ఆలయాన్ని కూల్చివేసిన కేసులో నిందితులను 24 గంటల్లోనే అరెస్టు చేయడం అభినందనీయమని టీఎస్ఎన్వీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు కట్టా దొరస్వామినాయుడు పేర్కొన్నారు.ఆయన ఎస్పీ విద్యాసాగర్నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. జిల్లాలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
330views
You Might Also Like
నేతాజీ అస్థికలు భారత్కు వస్తాయా? సుప్రీంకోర్టులో కీలక పరిణామం
39
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను జపాన్ నుంచి భారత్కు తీసుకురావాలన్న అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. టోక్యోలోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచినట్లు చెబుతున్న...
బ్రిటన్ను ఇస్లామిక్ రిపబ్లిక్గా అభివర్ణించిన నెతన్యాహు
31
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి తన వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా వివాదాన్ని రాజేశారు. బ్రిటన్ను "ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బ్రిటన్" అని అభివర్ణించిన ఆయన, అణ్వాయుధాలు కలిగిన...
షహజాద్ భట్టీ నెట్వర్క్పై భారీ ఆపరేషన్.. 14 రాష్ట్రాల్లో 200 మందికిపైగా అరెస్టు
34
న్యూఢిల్లీ: ఐఎస్ఐ మద్దతు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న షహజాద్ భట్టీ నెట్వర్క్పై దేశవ్యాప్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి...
మెరిట్ ఆధారంగానే అర్చకులు, వేద పండితుల నియామకాలు
59
రాష్ట్రంలోని దేవాలయాల్లో అర్చకులు, వేద పండితులు, పరిచారకులు, ఇతర ధార్మిక సిబ్బంది నియామకాల్లో ప్రస్తుతం జోనల్ విధానం అమల్లో లేదని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ...
Key Focus on Demographic Imbalance and Youth De-addiction Major Topics on the Agenda for RSS Meetings : RSS Akhil Bharatiya Prachar Pramukh Sunil Ambekar
51
Visakhapatnam, August 18: Sunil Ambekar, Akhil Bharatiya Prachar Pramukh of the Rashtriya Swayamsevak Sangh (RSS), stated that the upcoming meetings...
‘హిందువులను సహిస్తున్నాం’.. జర్దారీ వ్యాఖ్యలపై జావేద్ అక్తర్ ఘాటు స్పందన
55
ముంబై: పాకిస్థాన్లోని హిందూ జనాభాను తాము ‘సహిస్తున్నామని’ ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ గీత రచయిత, స్క్రీన్రైటర్ జావేద్ అక్తర్...





