విజయనగరంలోని కొత్తవలస సబల స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి, చిరుధాన్యాల చెల్లెళ్ల సంఘం వ్యవస్థాపకురాలు మల్లువలస సరస్వతికి జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. సీఐఐ ఫౌండేషన్ మైక్రో ఎంటర్ప్రైజస్ విభాగంలో ఉమెన్ ఎక్సెంప్లర్ అవార్డు-2024 వరించింది.ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక వ్యాపార సమ్మిట్లో ఆమెకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రదానం చేశారు. ట్రోఫీ, ధ్రువపత్రం, రూ.3 లక్షల నగదును అందజేశారు. విజయనగరం జిల్లాలో 20 వేల మంది మహిళలకు జీవనోపాధి అవకాశాలు కల్పించినందుకు గానూ ఆమెకు ఈ అవార్డు దక్కింది. దేశవ్యాప్తంగా 300లకు పైగా నామినేషన్లు దాఖలు కాగా ఆన్లైన్లో ముఖాముఖి నిర్వహించి, క్షేత్రస్థాయిలో చేపట్టిన పనుల తీరును పరిశీలించి 16 మందిని ఎంపిక చేయగా.. అందులో సరస్వతి ఒకరు. ఈమె గృహహింస, లింగ వివక్షపై పోరాటాలు చేశారు. ఆహార భద్రత కోసం చేపట్టిన కార్యక్రమాలతో గుర్తింపు పొందారు. చిరుధాన్యాల చెల్లెళ్ల సంఘం ద్వారా వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు. ఈ మేరకు ఎంపిక చేసినట్లు సీఐఐ పేర్కొంది.
250views
You Might Also Like
హిందూ ధర్మం : ఆత్మ చైతన్యం – సామాజిక సమరసత
హిందూ ధర్మం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. దాని మూలాలు బాహ్య రూపాలలో కాకుండా అంతర్గత ఆత్మతత్వంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆది...
యూపీ మదర్సాలపై దర్యాప్తులో హైకోర్టు భిన్నాభిప్రాయాలు
4
ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వ నిధులు పొందుతున్న 558 మదర్సాలలో అక్రమాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) దర్యాప్తునకు ఆదేశించిన వివాదంలో అలహాబాద్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలను...
ఆరెస్సెస్ రాజకీయాలకు, అధికార శక్తికి ఎందుకు దూరంగా వుంటుంది?
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా సంఘ్ వివిధ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. అయితే... సంఘ్ ఇంత విస్తరించినా.....
ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
7
గుజరాత్ లోకల్ బాడీ ఎన్నికల్లో గోధ్రాలో తొలిసారిగా, ముస్లిం మెజారిటీ ప్రాంతంలో ఒక హిందూ మహిళ గెలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. గోధ్రా అల్లర్లు భారత చరిత్రలో...
భారత్కు చేరిన పురాతన కళాఖండాలు
6
అక్రమంగా తరలించిన భారత పురాతన సంపద తిరిగి స్వదేశానికి చేరుకుంది. అమెరికాలోని మాన్హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ (డీఏ) కార్యాలయం సుమారు 14 మిలియన్ డాలర్ల (దాదాపు రూ....
చెరువులో మహావిష్ణుమూర్తి విగ్రహం
7
కృష్ణా జిల్లా గూడూరు మండలంలోని రామానుజవత్తర్లపల్లిలో మహావిష్ణుమూర్తి ఆకారంలో ఉన్న శిలా విగ్రహం బయటపడింది. గ్రామంలోని చెరువులో మట్టిని స్థానిక రైతు మట్టా లక్ష్మీనారాయణ తన ఇంటి...





