విజయనగరంలోని కొత్తవలస సబల స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి, చిరుధాన్యాల చెల్లెళ్ల సంఘం వ్యవస్థాపకురాలు మల్లువలస సరస్వతికి జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. సీఐఐ ఫౌండేషన్ మైక్రో ఎంటర్ప్రైజస్ విభాగంలో ఉమెన్ ఎక్సెంప్లర్ అవార్డు-2024 వరించింది.ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక వ్యాపార సమ్మిట్లో ఆమెకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రదానం చేశారు. ట్రోఫీ, ధ్రువపత్రం, రూ.3 లక్షల నగదును అందజేశారు. విజయనగరం జిల్లాలో 20 వేల మంది మహిళలకు జీవనోపాధి అవకాశాలు కల్పించినందుకు గానూ ఆమెకు ఈ అవార్డు దక్కింది. దేశవ్యాప్తంగా 300లకు పైగా నామినేషన్లు దాఖలు కాగా ఆన్లైన్లో ముఖాముఖి నిర్వహించి, క్షేత్రస్థాయిలో చేపట్టిన పనుల తీరును పరిశీలించి 16 మందిని ఎంపిక చేయగా.. అందులో సరస్వతి ఒకరు. ఈమె గృహహింస, లింగ వివక్షపై పోరాటాలు చేశారు. ఆహార భద్రత కోసం చేపట్టిన కార్యక్రమాలతో గుర్తింపు పొందారు. చిరుధాన్యాల చెల్లెళ్ల సంఘం ద్వారా వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు. ఈ మేరకు ఎంపిక చేసినట్లు సీఐఐ పేర్కొంది.
300views
You Might Also Like
హిందూ ధర్మంపై ‘విద్వేషపు’ పడగ
సమాజంలో ‘భావప్రకటన స్వేచ్ఛ’ ముసుగులో హిందూధర్మం, దేవతలపై ప్రణాళిక ప్రకారం కుట్రపన్ని విద్వేషాన్ని చిమ్ముతున్నారు. కొందరు విద్రోహశక్తులు భారతదేశాన్ని, అందులోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ను తమ విభజనవాద రాజకీయాలకు...
భోజ్శాలపై ముస్లింల పిటిషన్.. శుక్రవారం విచారిస్తామన్న సుప్రీం
5
మధ్యప్రదేశ్లోని భోజ్ శాల ఆలయ వివాదంపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది. కాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ స్థలానికి సుమారు 2కి.మీ. దూరంలో మసీదుకు ప్రత్యామ్నాయ స్థలాన్ని...
‘నన్ను బెంగాల్ నుంచి పంపించిన వారే ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ మద్దతుదారునని అంటున్నారు’: తస్లీమా నస్రీన్
7
కోల్కతా: బంగ్లాదేశ్కు చెందిన రచయిత్రి తస్లీమా నస్రీన్ తన కోల్కతా పర్యటనకు ముందు కమ్యూనిస్ట్ పార్టీలపై విమర్శలు చేశారు. సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్'లో చేసిన పోస్టులో,...
హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు: ధ్రువ్ రాఠీ వీడియోను 24 గంటల్లో తొలగించాలి : గ్రీవెన్స్ అప్పిలేట్ కమిటీ
7
న్యూఢిల్లీ: హిందూ దేవతల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ ధ్రువ్ రాఠీ వీడియోను 24 గంటల్లో తొలగించాలని సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ...
మహారాష్ట్రలో అల్-హలీమీ ఫౌండేషన్ కేసు: 14 వేల పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసిన ఏటీఎస్
7
మహారాష్ట్రలోని బార్షిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అల్-హలీమీ ఫౌండేషన్కు సంబంధించిన కేసులో రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) కోర్టులో 14,000 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఛారిటీ...
హింస, వేధింపులతో విసిగిపోయాను.. లొంగిపోయిన మావోయిస్టు కమాండర్ భార్య
32
ఆర్గనైజేషన్ అంతర్గత వేధింపులు, గ్రామస్థులపై శ్రేణులు జరుపుతున్న అనవసర హింసతో విసిగిపోయానని చెబుతూ ఒక కీలక మహిళా మావోయిస్ట్ నేత ఝార్ఖండ్లోని గిరిడీ పోలీసుల ఎదుట లొంగిపోయారు....





