
257views
తూర్పు తీరం వెంబడి భారీ యుద్ధ విన్యాసాలను నిర్వహించినట్లు భారత నౌకాదళం శనివారం ప్రకటించింది. సముద్రం వైపు నుంచి ఎదురయ్యే భద్రతా సవాళ్లను తిప్పికొట్టడంలో నేవీ పోరాట సన్నద్ధతను పరీక్షించుకోవడం దీని ఉద్దేశమని తెలిపింది. ‘పూర్వీ లెహర్’ పేరిట జరిగిన ఈ విన్యాసాల్లో యుద్ధనౌకలు, జలాంతర్గాములు, విమానాలు, నౌకాదళ ప్రత్యేక బలగాలు పాలుపంచుకున్నాయని పేర్కొంది. ఈ విన్యాసాలు బహుళ దశల్లో జరిగాయని వివరించింది. ఇందులో తూర్పు నౌకాదళంతోపాటు వాయుసేన; అండమాన్, నికోబార్ కమాండ్, తీర రక్షణ దళం కూడా పాల్గొన్నాయి. ఈ బలగాల మధ్య అద్భుత సమన్వయాన్ని ఈ యుద్ధక్రీడలు చాటాయని అధికారులు తెలిపారు.





