News

గోవధ చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

265views

శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని చెరుకూరు గ్రామ సమీపంలో గోవధకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు రొద్దం ఎస్‌ఐ బాషావలి తెలిపారు. అందిన ముందస్తు సమాచారంతో బుధవారం సాయంత్రం చెరుకూరు శివారులో తనిఖీలు చేపట్టామన్నారు. ఆ సమయంలో పశువును కోస్తున్న నయాజ్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేసి, గోవధ నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు వివరించారు.