News

నేత్రానందంగా గరుడసేవ

374views

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ నేత్రానందంగా జరిగింది. రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామి తనకెంతో ఇష్టమైన గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.