
అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నారు. ఇప్పటికే ఈ ఆలయ నిర్మాణానికి దేశం, ప్రపంచం నుండి విరాళాలు సేకరిస్తున్నారు. ఇది మొత్తం పన్నుకు సంబంధించినదే అయినా.. ఈక్రమంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. విరాళాలుగా వచ్చిన సొమ్ముపై పన్నును మాఫీ చేసింది. ఈ సందర్బంగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. ట్రస్ట్కు సుమారు రూ. 1800 కోట్ల పన్ను మినహాయింపు లభించిందని తెలిపారు.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆలయ ప్రతిష్ఠాపన కోసం నిధి సమర్పణ ప్రచారాన్ని ప్రారంభించిందని రాయ్ చెప్పారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రచారంలో దాదాపు 5500 కోట్ల రూపాయలు వచ్చాయి. దీంతో ట్రస్టుపై ఆదాయపన్ను శాఖ దాదాపు రూ.1800 కోట్ల పన్ను విధించగా.. ఇప్పుడు వసూలు చేయడం లేదన్నారు. ఇటీవల జరిగిన ట్రస్టు సభ్యుల సమావేశంలో రాయ్ ఈ పన్ను గురించి తెలియజేశారు. 2020 మరియు 2021 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ట్రస్ట్ దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్ యథాతథంగా ఆమోదించబడింది. ఆదాయపు పన్ను విధించబడదు. ఇక్కడ, ట్రస్ట్ క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జ్ ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ… అసెస్మెంట్ అథారిటీ సంతృప్తి చెందనప్పుడు.. అది పన్ను విధిస్తుంది. దీనిపై కోర్టులో అప్పీలుకు వెళ్లినప్పుడు, పన్ను ఉపసంహరించబడుతుంది. ప్రభుత్వం 80G కింద దాతకి యాభై శాతం పన్ను మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు.
వాస్తవానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80G ప్రకారం, దాత దాతృత్వం లేదా విరాళం అందించిన సహాయంపై పన్ను మినహాయింపు పొందుతారు. ట్రస్ట్పై పన్ను విధించడం వల్ల ప్రయోజనం లేదని.. అయితే దేశం మొత్తం మీద నిధి సమర్పణ్ అభియాన్ జరుగుతోందని వివరించారు. అందుకే ఆ సమయంలో అసెస్మెంట్ అథారిటీ అవిశ్వాసం పెట్టి పన్ను విధించిందని గుప్తా చెప్పారు. తమ ఖాతాను TCS నిర్వహిస్తుండగా. ఢిల్లీకి చెందిన ప్రముఖ సంస్థ ఆడిట్ను నిర్వహిస్తుందన్నారు.





