News

భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది – ఈజిప్టు జర్నలిస్టు సుజీ వెల్లడి

244views

అభివృద్ది చెందుతున్న దేశాల్లో భారత్‌ ముందు వరుసలో ఉందని ఈజిప్ట్ దేశ ప్రధాన దినపత్రిక అల్-అహ్రమ్ అల్-అరిబీ డిప్యూటీ చీఫ్ ఎడిటర్ సుజీ ఎల్-జెనీడీ అన్నారు. ఈ ఏడాది జనవరి 26న దేశ రాజధాని దిల్లీలో జరగనున్న గణతంత్ర వేడుకల్లో ఈజిప్టు దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా ఎల్-సిసి పాల్గొననున్నార. ఈక్రమంలో ఈజిప్టుకు చెందిన మీడియా ప్రతినిధులు భారతదేశానికి వచ్చారు. ఈ సందర్బంగా అక్కడి జర్నలిస్తు సుజీఎల్‌ జెనిడీ మాట్లాడుతూ.. ”భారత్‌కు ఇప్పటి వరకు మూడు సార్లు వచ్చాను.. ఈ క్రమంలో ఎన్నో మార్పులను గమనించాను. భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది. రక్షణ రంగం, ఐటీ, ఇతర సాంకేతిక రంగాలలో రాణిస్తోంది” అని ఆమె తెలిపారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా దేశాలు మాత్రమే ప్రపంచాన్ని శాశిస్తున్నాయని రానున్న రోజుల్లో భారత్‌ సైతం ఆ స్థాయికి ఎదగగల సత్తా ఉందని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఖండించి, శాంతియుతంగా విరమించుకోవాలని కోరిన వ్యక్తుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొదటి వారని ఆమె కొనియాడారు. “దురదృష్టవశాత్తు ప్రపంచం ఇప్పుడు మంచి స్థితిలో లేదని.. కోవిడ్-19 తోపాటు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి వాటివల్ల చాలా నష్టపోయామన్నారు. ప్రస్తుతం అన్ని దేశాలు శాంతియుతంగా ఉంటూ.. మనుషులుగా మనం ఇతర సవాళ్ల గురించి ఆలోచించాలని తాను భావిస్తున్నట్లు వివరించారు. వాటిలో వాతావరణ మార్పు ఒకటి అని ఆమె తెలిపారు. వాతావరణ మార్పులతో సంభవించే ప్రమాదాలను ఏవిధంగా ఎదుర్కోవాలో ప్రపంచ దేశాలు ఆలోచించాలన్నారు. మరోవైపు భారత్‌-ఈజిప్టు బంధాన్ని వివరిస్తూ.. ఈ రెండు దేశాల మధ్య సంబంధం ఇప్పటిది కాదన్నారు. ఈ రెండు దేశాలు చరిత్రకు మూలకారణంగా నిలిచాయన్నారు. దౌత్య సంబంధాలు, ఇతర ఒప్పందాలపై ఇరు దేశాలు సానుకూలంగా ఉన్నాయన్నారు.