
307views
విశాఖపట్నం — ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం సమీపంలోని చినగాదిలిలో సాయిబాబా ఆలయంలో బాబా వారి రోబోటిక్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం జోడించారు. దీంతో విగ్రహం కళ్ళు కదపడం, మాట్లాడటం కూడా చేస్తోంది. దీన్ని వై. రవిచంద్ మూడేళ్లపాటు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. రోబోటిక్ సాంకేతికత కూడుకున్న బాబా విగ్రహాన్ని చూసేందుకు పెద్దఎత్తున భక్తులు తరలి వస్తున్నారు.





