
ప్రముఖ సామాజిక మాధ్యమం.. ప్రపంచ వ్యాప్తంగా అందరికీ సుపరిచితమైన ట్విట్టర్…. భారత్లోని 48,624 అకౌంట్లను నిషేధించింది. ట్విటర్ నిర్వాహకులకు వచ్చిన ఫిర్యాదుల మేరకు.. ఈ చర్యలకు పాల్పడినట్లు వెల్లడించారు. అందులో న్యూడిటీ, పిల్లలపై లైంగిక దోపిడీ ప్రోత్సాహించేలా ఉండటమే ప్రధాన కారణంగా తెలిపింది. సదరు అకౌంట్లు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 25 మధ్యకాలంలో ట్విట్టర్ నియమాలను ఉల్లంఘించినట్లు వెల్లడించింది. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. కొత్త ఐటీ రూల్స్, 2021కి అనుగుణంగా ట్విటర్ నెలవారీ నివేదికలో, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం ద్వారా ఒకే సమయంలో భారత్ నుంచి 755 ఫిర్యాదులను స్వీకరించినట్లు తెలియజేసింది. మవాటిలోని 121 యూఆర్ఎల్ (URL)లపై చర్య తీసుకున్నట్లు పేర్కొంది. వీటిలో కోర్టు ఆదేశాలతోపాటు వ్యక్తిగత వినియోగదారుల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు కూడా ఉన్నాయి.
అందుకున్న ఫిర్యాదులు ఇలా..
దుర్వినియోగం/వేధింపు (681), తర్వాత ఐపీ (IP)-సంబంధిత ఉల్లంఘన (35), ద్వేషపూరిత ప్రవర్తన (20), గోప్యతా ఉల్లంఘన (15)కు సంబంధించినవిగా పేర్కొంది. కొత్త IT రూల్స్ 2021 ప్రకారం, భారీ డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్ఫారంలు, 5 మిలియన్లకు పైగా వినియోగదారులతో నెలవారీ నివేదికలను ప్రచురించాల్సి ఉంటుంది.