News

బొగ్గు దొంగల ముఠా, జవాన్ల మధ్య కాల్పులు.. నలుగురు మృతి

92views

ధన్​బాద్: ఝార్ఖండ్​ ధన్​బాద్ ​జిల్లాలోని బాఘ్మారా డుమ్రాలో సీఐఎస్ఎఫ్ పోలీసులు, బొగ్గు దొంగల ముఠాకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మరణించారు. ఇద్దరికి గాయాలయ్యాయి. సీఐఎస్ఎఫ్ వర్గాల సమాచారం ప్రకారం.. బొగ్గును దొంగిలించే నెపంతో దొంగల ముఠా డుమ్రాలోని కేకేసీ బీసీసీఎల్ రెండో బ్లాక్ వద్దకు వచ్చారు. బొగ్గును దొంగతనం చేసేందుకు ప్రయత్నించగా.. వారిని జవాన్లు హెచ్చరించారు. దీంతో ఇరు వర్గాలకు భీకర పోరు జరిగింది. దొంగలు కాల్పులకు తెగబడ్డారు. దీంతో జవాన్లు సైతం కాల్పులు ప్రారంభించారు.

ఈ పోరులో నలుగురు బుల్లెట్​ గాయాలతో మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను షహీద్ నిర్మల్ మహతో బోధనాసుపత్రికి తరలించారు. గాయాలపాలైన ఇద్దరి పరిస్థితి విషమించటం వల్ల వారిని రాంచీలో హాస్పిటల్​లో చేర్పించారు. అయితే ఈ ఘటన గురించి సీఐఎస్ఎఫ్ జవాన్ల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఘటనా స్థలాన్ని పోలీసులు, సీఐఎస్ఎఫ్ జవాన్లు సీజ్ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి