News

కేంద్రం చొరవతో అభివృద్ధికి కేంద్ర బిందువులుగా మారుమూల గ్రామాలు

429views

నర్సాపురం: కేంద్ర ప్రభుత్వ చొరవతో దేశ వ్యాప్తంగా ఉన్న మారుమూల గ్రామాలు, అభివృద్ధికి కేంద్ర బిందువులుగా మారుతున్నాయని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాన్సద్ ఆదర్శ గ్రామ యోజన పథకం అనేక గ్రామాల రూపురేఖలు మార్చిందని, ఇందులో భాగంగానే తాను దత్తత తీసుకున్న పెదమైన వాని లంక (పి.ఎం.లంక) గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆమె, స్వీయదత్తత గ్రామమైన నర్సాపురం మండలంలోని పి.ఎం.లంక, వీరవాసరం మండలంలోని మత్స్యపురి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తొలుత వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో ఎంపి లాడ్స్ రు.1.25 కోట్లు వ్యయంతో నిర్మించిన రాపిడ్ శాండ్ ఫిల్టర్ కేంద్రాన్ని శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు.

అనంతరం నీటి శుద్ది కేంద్రం పనితీరును పరిశీలించారు. ఆ తర్వాత ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించిన అనంతరం అదే ప్రాంగణంలో వున్న మంచినీటి చెరువును సందర్శించి, కొబ్బరి మొక్కని నాటారు. ఈ నీటి శుద్ధి కేంద్రం ద్వారా వీరవాసరం మండలం మత్స్యపురి, గొడివారి ఆదిఆంధ్ర పేట గ్రామాలలోని 1,110 కుటుంబాలకు శుద్ధిచేసిన తాగునీటి సరఫరా కానున్నది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి